Kanuma Festival Travel: కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయొద్దా?.. చేస్తే ఏమవుతుందో తెలుసా..!
- తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ..
- కనుమను పశువుల పండుగగా భావించేవారు ప్రజలు..
- ఈ రోజున ఎద్దులు, ఆవులు, గేదెలను అలంకరించి ఊరేగింపులు, పందెం పోటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanuma Festival Travel: తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ మరుసటి రోజున కనుమ (Kanuma Festival)ను జరుపుకుంటారు. ఏటా 12 సంక్రాంతులు మాదిరిగానే కనుమలూ వస్తుంటాయి. అయితే, మకర సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమకు ప్రత్యేకంగా వేడుకలు చేసుకుంటారు. ఇది పాడి పశువుల ఫెస్టివల్.. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సాహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత చెప్పుకుంటారు. పండించిన పంటను పశుపక్ష్యాదులతో పంచుకోవాలని ఉద్ధేశ్యంతో పిట్టల కోసం ఇంటి గుమ్మాలకు ధాన్యపు కంకులను అన్నదాతలు కడతారు. ఇక, కనుమ రోజు కాకులు అయినా కదలదనే సామెతను గుర్తు చేస్తూ.. ఈ రోజు ప్రయాణాలు చేయొద్దని పూర్వీకులు చెబుతుంటారు.
Read Also: US-Iran: వెనక్కి తగ్గిన అమెరికా.. తెరుచుకున్న ఇరాన్ గగనతలం
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
అయితే, పల్లెల్లో పశువులే గొప్ప సంపదగా భావిస్తారు.. అవి ఆనందంగా ఉంటేనే కదా రైతుకు ఆనందం. కాగా, కనుమ పండుగను పల్లెల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం రైతుతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులూ చేయించకుండా పూర్తిగా విశ్రాంతిని కల్పిస్తారు. రకరకాల పోటీలు నిర్వహించి ఆనందిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదనే ఆచారం వెనుక ఓ గొప్ప విషయం ఇమిడి ఉంది. వాస్తవానికి పూర్వకాలంలో ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్క రోజైనా వాటికి రెస్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు ప్రయాణాన్ని వాయిదా వేసుకునేవారు. దీంతో కనుమ రోజున కాకి అయినా కదలదు అనే సామేత వచ్చింది.
Read Also: Prabhala Theertham: నేడు జగ్గన్నతోటలో ప్రభల తీర్థం.. భారీగా వెళ్తున్న జనం..
కాగా, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పండుగ సమయంలో వచ్చిన బంధుమిత్రులు వెంటనే వెళ్లిపోకుండా అందరితో ఆనందంగా గడిపేందుకు.. కలిసి భోజనం చేస్తూ కష్టసుఖాలను పంచుకొవడానికి వీలుగా కూడా ఈ నియమం పెట్టారని కూడా చెప్పొచ్చు. అయితే, తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల గురుగుల నోమును ఆచరించే సంప్రదాయం ఉంది. కొత్తగా పెళ్లైన వారు.. ఈ పండగ సమయంలో మట్టితో చిన్న పాత్రల్ని తయారు చేసుకుని అందులో బెల్లం-నువ్వుల ఉండలు, చెరకు ముక్కలు, చిల్లర, రేగుపళ్లు, జీడిపళ్లు లాంటివి పెట్టి తాంబూలంగా ఇవ్వడం అక్కడి సంప్రదాయంగా వస్తుంది.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!