Bhatti Vikramarka: రిటైరైన సోమేష్ కుమార్ కు మళ్లీ పదవి ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: ఉద్యోగ విరమణ చేసిన సోమేశ్ కుమార్ కి మళ్ళీ పదవి ఏంటి? అని, సోమేశ్ కుమార్ కి ఇచ్చిన ఆర్డర్ చూసి ఆశ్చర్యం వేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి ఎక్స్ రోడ్ పాదయాత్ర శిబిరం నుంచి భట్టి మాట్లాడుతూ.. సోమేశ్ కుమార్ కి ఇచ్చిన ఆర్డర్ చూసి ఆశ్చర్యం వేసిందని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి మళ్ళీ పదవి ఏంటి? అంటూ షాక్ కు గురయ్యానని అన్నారు. ఇక్కడ ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటి.? అని ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చిందే ఉద్యోగాల కోసం అని అన్నారు. వెట్టి చాకిరి చేసుకునే వాళ్ళ భూములు కూడా లాక్కుంటుంది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కేటీఆర్.. హైద్రాబాద్ అభివృద్ధి చేయకపోగా ఓఆర్ఆర్ అమ్ముకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సోమేశ్, అరవింద్, కలిసి అమ్ముకునే స్కిం ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు. ప్రజలకు ఉపయోగ పడే స్కింలు ఇవ్వాలి కానీ.. స్కామ్ లు చేసుకునే సలహాలు ఇస్తున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Bhatti vikramarka: ఓసారి యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లు.. తలసానికి భట్టి సవాల్
Also Read
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
- KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
- Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
- Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.. చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఓఆర్ఆర్ని ముపై ఏండ్లు అమ్మకానికి పెడితే ఎలా ? అందిన కాడికి అమ్ముకోవడమే అంటూ ఆరోపణలు చేశారు. అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మందిని సలహాదారులుగా పెట్టుకుంటారు? అంటూ ప్రశ్నించారు. మేము పేదలకు ఇచ్చిన భూములు అన్నీ మీవే? ఈ ప్రభుత్వానికి ఏ హక్కు లేదన్నారు. మీ భూమి దగ్గర మీరు ఉండండి, ఆ భూముల్లో అరకలు కట్టండి.. ఎవడు అడ్డు వచ్చినా ఆగకండి అంటూ సూచించారు. ఆరు నెలలు కాపాడుకోండి.. ఆరు నెలల తరవాత ఇందిరమ్మ రాజ్యం వస్తోందని భట్టి అన్నారు. ధరణి సృష్టి కర్త ..స్కామ్ స్టార్ సోమేశ్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమేశ్ పై విచారణ జరిపించాలని..! విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరం అయితే రాష్ట్రపతిని కూడా కలుస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా సమాచారం ప్రజలకు చేరవేయండి అని సూచించారు. రిటైర్డ్ అయిన వాళ్ళు గబ్బిలాల లెక్క పట్టుకుని వేలాడుతున్నారని అన్నారు. ఉద్యోగాలు లేని వాళ్ళను బతకనీయండి అని భట్టి తెలిపారు.
Sabitha Indra Reddy: ఫెయిలైతే సప్లిమెంటరీ ఉంది.. ఇంటర్ స్టూడెంట్లు చనిపోవడంతో బాధేసింది
తాజావార్తలు
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
-
Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
-
TVS Raider Doctor Doom Edition: మార్వెల్ డాక్టర్ డూమ్ స్ఫూర్తితో టీవీఎస్ కొత్త బైక్.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే!
-
Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
-
TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!