Harish Rao: రాబోయే రోజుల్లో పక్క రాష్ట్రాలకు మెడిసిన్ ఎగుమతి చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: రాబోయే రోజుల్లో పక్క రాష్ట్రాలకు కూడా మందులు సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదుగుతుంది మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో ఆయుర్వేదిక్ వైద్యుల కృతజ్ఞత సభ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. షుగర్, బీపీ ట్యాబ్లెట్ల నుంచి బయటికి రావాలంటే మన జీవన శైలిలో మార్పులు రావాలని కోరారు. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పు వస్తే బీపీ, షుగర్ నయం చేయవచ్చని తెలిపారు. ఆరెళ్ల వరకు బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు వాడానని, ఆహారపు అలవాట్ల మార్పుతో ఆరు నెలల నుంచి షుగర్ లేదని, ఇంకా బీపీ ఉంది పోలేదని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల్లో దేశంలో 11 స్థానంలో ఉండేదని అన్నారు. ఇప్పుడు 3 స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు మంత్రి. ఆయుష్ విభాగంలో అందరం కష్టపడి నంబర్ వన్ స్థానానికి వచ్చేటట్టు కృషి చేద్దామన్నారు.
Read also: KTR: తర్వలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు.. ఈ ప్రక్రియ అల్లం నారాయణకు అప్పగించామన్న కేటీఆర్
Also Read
రాబోయే రోజుల్లో పక్క రాష్ట్రాలకు కూడా మందులు సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదుగుతుందన్నారు. డాక్టర్లు పేషేంట్ల పట్ల ప్రేమ, ఆప్యాయతతో వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రుల్లో అత్యధిక మరణాల్లో టాప్ టెన్ లో మన దేశం కూడా ఉండటం బాధాకరమన్నారు. ఇన్ని రోజులు పరిపాలించిన పాలకులు వైద్య రంగాన్ని పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ మోడల్ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తే మరణాలు తగ్గే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణలో డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రులలో 70 శాతం జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో అత్యధిక మాంసం తినేది తెలంగాణ లోనే అని అన్నారు. రాజస్థాన్ లో 32 శాతం నాన్ వెజ్ తింటే..తెలంగాణలో 99.2 శాతం మంది మాంసాహారం తింటారని వెల్లడించారు. ఉప్పు, కారం ఎక్కువగా తినేది కూడా మనమే..అందుకే మనకు కోపమెక్కువ అంటూ తన మాటలతో ప్రజలకు మంత్రి నవ్వించారు. అనంతరం అక్కడి నుంచి సిద్దిపేట రైతు బజార్ను సందర్శించి, క్లీన్ అండ్ గ్రీన్ సిద్దిపేట పట్ల నిబద్ధతను సాక్ష్యాధారాలుగా చూశారు. ఈ శక్తివంతమైన మార్కెట్ లో రైతులతో సంభాషించారు. దాని పరిశుభ్రతను కాపాడుకోవడానికి, మన స్థానిక వ్యవసాయ సమాజానికి మద్దతు ఇవ్వడానికి కలిసి పని చేద్దామని మంత్రి అన్నారు.
Lok Sabha Election 2024: ప్రతిపక్షాల కూటమి పేరు పీడీఏ..? అన్ని పక్షాలు అంగీకరించినట్లుగా టాక్..
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!