Warangal Preethi Case: పూలదండ ఎందుకు తెచ్చావ్.. నిలదీసిన ప్రీతి సిస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Preethi Sister Questioned Governor Tamilisai: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతిని పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరాజన్ను ఆమె కజిన్ సిస్టర్ నిలదీసింది. నిన్న ఆస్పత్రికి గవర్నర్ పూలదండతో వచ్చారని, అసలు పూలదండ ఎవరి కోసం తెస్తారు? అని ప్రశ్నించింది. తన సోదరి ఇంకా బతికే ఉందని, బతికున్న వారి కోసం పూలదండలు తీసుకొస్తారా? అని అడిగింది. గవర్నర్ లాంటి హోదాలో ఉండి మీరేం చేస్తున్నారు? అని మండిపడింది. ఒక సమాజాన్ని కాపాడే డాక్టర్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే మీరేం చేస్తున్నారు? వచ్చి పూలదండలు వేసిపోతారా? అని ఫైర్ అయ్యింది.
Errabelli Dayakar Rao: ప్రీతి ఘటనపై బీజేపీ వాళ్లు లేని తగాదాలు సృష్టిస్తున్నారు
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
తమకు కావాల్సింది ఓదార్పు కాదు, న్యాయమని పేర్కొన్న యువతి.. ఈ ఘటనపై ఒక ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. పరామర్శించేందుకు వచ్చామని మీడియా ముందు పబ్లిసిటీ చేసుకోవడం కాదని.. మీకు చేతకాకపోతే తామే స్వయంగా కమిటీ వేసుకొని, తమ అక్కకు ఏం జరిగిందో తెలుసుకుంటామని సవాల్ విసిరింది. మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఇలాంటి ఘటనలే ఎదురైతే.. మీరు పూలదండలతో వెళ్తారా? అని ప్రశ్నించింది. స్పెషల్ కమిటీ వేయాల్సిందేనని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిందేనని ప్రీతి సిస్టర్ కోరింది. హార్ట్ ఫంక్షనింగ్ లేకపోయినా, ఫంక్షనింగ్ ఉందంటూ ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పరామర్శించేందుకు ఎవరూ రావాల్సిన అవసరం లేదని, స్పెషల్ కమిటీ వేసి ఒక గంటలోనే రిజల్ట్ తీసుకురావాలని ఆ యువతి డిమాండ్ చేసింది.
Kodali Nani vs Chandrababu: నేను, వంశీ వస్తాం.. కొట్టుకుందాం.. నువ్వు రెడీ నా బాబు?
మరోవైపు.. ప్రీతి సిస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజ్ భవన్ స్పందించింది. నిమ్స్ వెళ్లిన సమయంలో గవర్నర్ వాహనంలో పూలదండ ఉండటంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. హనుమంతుని గుడిలో సమర్పించడానికి గాను కారులో పూలదండ ఉంచడం జరిగిందని స్పష్టం చేసింది. అంతే తప్ప.. దానిపై విపరీతార్ధాలు తీయటం సహేతుకం కాదని రాజ్ భవన్ తెలిపింది. అంతేకాదు.. హనుమంతుని గుడిలో వైద్య విద్యార్థిని త్వరగా కోలుకోవాలని కూడా గవర్నరు ప్రార్ధన చేశారని క్లారిటీ ఇచ్చింది. రాజ్ భవన్కు వచ్చిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి మెడికో సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవల్సిందిగా ఒక లేఖ ద్వారా ఆదేశించారని వెల్లడించింది. గవర్నరు నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్ధం చేసుకోవాలని రాజ్ భవన్ విజ్ఞప్తి చేసింది.
Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ ఎన్నికలు వద్దంటూ తీర్మానం
తాజావార్తలు
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!