Kishan Reddy : ఓరుగల్లు 40 ఏళ్ల కల సాకారమైంది..
- ఓరుగల్లు అభివృద్ధికి 3 యూనిట్లు – కిషన్ రెడ్డి హామీ
- “మోడీ గ్యారంటీ తప్పకుండా నెరవేరుతుంది” – వరంగల్ ప్రాజెక్టుల వివరాలు
- ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 2026లో ప్రారంభం – అశ్వినీ వైష్ణవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చే ప్రాజెక్టులను ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వరంగల్, ఖాజీపేట అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కలను సాకారం చేశాం. వ్యాగన్ తయారీ, కోచ్ల తయారీ, ఓవర్ హాలింగ్ కోసం మూడు యూనిట్లు మంజూరు చేశాం. దీని ద్వారా 3వేల మందికి నేరుగా ఉపాధి కలుగుతుంది. ఓరుగల్లు అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు కేటాయించింది. మోడీ గ్యారంటీ అంటే తప్పకుండా నెరవేరుతుంది” అని అన్నారు.
Also Read
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
Crime: మరీ ఇంత దారుణమా? మద్యం మత్తులో తల్లిదండ్రులను అతికిరాతకంగా చంపిన కొడుకు..
అలాగే, “వేయి స్తంభాల మంటపం, రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేశాం. త్వరలో వరంగల్కు ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మోడీ వరంగల్కు ఏం ఇచ్చారో వరంగల్కి వచ్చి చూసి మాట్లాడాలి. వరంగల్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ ఎల్లప్పుడూ కమిట్మెంట్తో ఉంది” అని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, “ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ల కల. ప్రధానమంత్రి మోడీ ఆ కలను సాకారం చేశారు. డిసెంబర్ నాటికి సివిల్ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. 2026లో మాన్యుఫాక్చరింగ్ ప్రారంభమవుతుంది. ఇంజన్లు, బోగీలు, మెట్రో ట్రైన్స్ తయారీ జరగనుంది. దేశంలో అతి పెద్ద మాన్యుఫాక్చరింగ్ యూనిట్గా ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిలుస్తుంది” అని తెలిపారు.
మోడీ ప్రభుత్వం తెలంగాణలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, పరిశ్రమల విస్తరణ, రవాణా, రైల్వే సదుపాయాల మెరుగుదలకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని ఇద్దరు మంత్రులు హామీ ఇచ్చారు.
Mythri Movie Makers: క్రికెట్ టీం అనౌన్స్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బోర్డుపై భారత్ స్కోర్ 900 పరుగులు..
-
PM Modi: నీట్ విద్యార్థుల కోసం ఎయిర్పోర్టులోనే ఆగిన ప్రధాని మోడీ..
-
Virat Kohli: వన్డే జట్టులో కోహ్లీ రికార్డుల వేట.. ఇంగ్లాడ్ పై ఆ ఘనత సాధిస్తాడా..?
-
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్పై నాన్ – బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
-
Uddhav Shiv sena: ముగింపుకు ఉద్ధవ్ సేన సంక్షోభం.. మీడియా ముందుకు తిరుగుబాటు ఎంపీలు..
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!