Konda Surekha: వరంగల్ మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తోంది.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
- వరంగల్ మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తోంది..
- మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు..
- నేడు వరంగల్ లక్ష్మీపురం లోని కూరగాయల మార్కెట్ ను సందర్శించి మంత్రి..
- కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు ప్లాస్టిక్ ఉపయోగిస్తే కఠిన చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha: వరంగల్ మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తోందని మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు వరంగల్ లక్ష్మీపురం లోని కూరగాయల మార్కెట్ ను సందర్శించి మార్కెట్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ లో అనేక అవకతవకలు జరిగాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనర్హులకు మార్కెట్ లో షాపులను కేటాయించారని తెలిపారు. కూరగాయల మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తోందన్నారు. అనర్హులను గుర్తించి తిరిగి షాపులను స్వాధీనం చేసుకుంటామన్నారు. చిరు వ్యాపారులను గుర్తించాలన్నారు. లైసెన్స్ ఇచ్చి మార్కెట్ లో చోటు కల్పించాలన్నారు. గత సెక్రటరీ కేటాయించిన దుకాణాల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ లో పార్కింగ్ తో పాటు మౌళిక సదుపాయలు కల్పిస్తామన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించడంతో పాటు కూరగాయల మార్కెట్ సమీపంలో వర్మీ కంపోస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Read also: Komati Reddy Counter: కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటి రెడ్డి గట్టి కౌంటర్
Also Read
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
- Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
- Warangal Rocket Launch : తొలిసారి ఓరుగల్లు గడ్డపై రాకెట్ ప్రయోగం.! ఆకాశంలోకి దూసుకెళ్లనున్న 'రుద్రమ' రాకెట్..
అందరికి లాభం జరిగే విధంగా అర్హులకు షాపులను ప్లాట్స్ కేటాయిస్తామన్నారు. మార్కెట్ లో భారీ షెడ్ తో పాటు, సీసీ రోడ్ మురుగు కాలువలను నిర్మిస్తామని తెలిపారు. అద్దెల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామన్నారు. డ్రా పద్ధతిలో దుకిణాలను.. కూరగాయల విక్రయాలు ప్లాట్ లను కేటాయిస్తారని అన్నారు. కూరగాయల మార్కెట్ లోనే పూల దుకాణాలకు చోటు కల్పిస్తామన్నారు. త్వరలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామన్నారు. మార్కెట్ లోని దుకాణాల పై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఇవ్వాలని సెక్రటరీని, కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. నూతనంగా కేటాయించే దుకాణాలకు కమిటి ఇవ్వాలన్నారు. మార్కెట్ లో ప్లాస్టిక్ ను నిషేధించాలి.. బాటిల్ వెండర్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో మార్కెట్ లో ఆలయంను నిర్మిస్తామని తెలిపారు. మార్కెట్ ను శుభ్రంగా ఉంచాలన్నారు. కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు ప్లాస్టిక్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం ఐతే నోటీసులు ఇచ్చి మార్పు రాకపోతే లైసెన్స్ తొలగించాలన్నారు. మార్కెట్ లో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
TFCC : ఘనంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం
తాజావార్తలు
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
-
IPL 2026 Playoffs Scenario: గుజరాత్ ఘన విజయం.. తగ్గిన ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్.. సీఎస్కేకు ప్లస్!
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
-
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!