Steel Bridge: స్టీల్ బ్రిడ్జి మూసివేత.. పోకిరీల వికృత చేష్టలే కారణమా?
Steel Bridge: ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2.25 కి.మీ నాలుగు లైన్ల స్టీల్ బ్రిడ్జిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు రూ.450 కోట్లు వెచ్చించారు. VST జంక్షన్, RTC క్రాస్ రోడ్స్ మరియు ఇందిరా పార్క్ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి దీనిని నిర్మించారు. సికింద్రాబాద్, తార్నాక, ఓయూ, చర్లపల్లి, అంబర్పేట, రామాంతపూర్, ఉప్పల్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే వారికి కూడా ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుంది. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీకి వెళ్లేందుకు గతంలో 35 నిమిషాలకు పైగా సమయం పట్టేది.. స్టీల్ బ్రిడ్జి రావడంతో కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే గమ్యం చేరుతుంది. అయితే ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జితో కొత్త కష్టాలు తలెత్తాయి. ఈ స్టీల్ బ్రిడ్జి పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది. దీంతో రాత్రి పూట పోకిరీలు రెచ్చిపోతున్నారు. హాస్టల్ను లక్ష్యంగా చేసుకుని ఈ యువతులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.
Read also: Warangal: ఫుల్ బాటిల్ కావాలి.. తల్వార్లతో మందుబాబు హల్ చల్
Also Read
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
ఇటీవల ఇద్దరు మైనర్ యువకులు బ్రిడ్జిపై ఫుల్ గా మద్యం తాగారు. మద్యం మత్తులో హాస్టల్ మెట్లు దిగి వస్తున్న ఓ యువతిపై బీరు బాటిల్ విసిరారు. బాలిక తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. హాస్టల్ పరిసరాల్లోని సీసీ కెమెరాలో పోకిరీల చేష్టలకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనతో హాస్టల్లో ఉంటున్న బాలికలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలపై స్థానికులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోకిరీలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రిపూట వంతెనపై రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు. స్టీల్ బ్రిడ్జిపై ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నగర ప్రజల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఫ్లై ఓవర్ను నిర్మించింది. వంతెన నిర్మాణానికి దాదాపు 20 మెట్రిక్ టన్నుల స్టీల్ను వినియోగించారు. దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన ఉక్కు వంతెన ఇదే. ఎలాంటి నిర్మాణాలు కూల్చివేయకుండా.. భూసేకరణ లేకుండా ఈ వంతెనను నిర్మించారు. మరో విశేషమేమిటంటే మెట్రో రైలు మార్గానికి ఎగువన నిర్మించిన తొలి ఫ్లైఓవర్ ఇదే.
Health Tips: నిద్రలో మాట్లాడుతున్నారా? ఐతే పెద్ద సమస్యకే దారి తీయవచ్చు
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Stock Market Rally: ఎన్నికల ఫలితాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ జోరు.. 800 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
-
BCCI: ఐపీఎల్ ఆటగాళ్ల ‘గర్ల్ఫ్రెండ్ కల్చర్’పై బీసీసీఐ సీరియస్.. హార్దిక్, యశస్వి, ఇషాన్, అర్ష్దీప్లకు బిగ్ షాక్!
-
Jai Hanuman: ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’లో ధురంధర్ నటుడు..
-
TMC: 2011 ఎన్నికలతో చరిత్ర సృష్టించిన టీఎంసీ.. 30 సీట్ల నుంచి 184 సీట్లకు.. మమతా బెనర్జీ విజయగాథ
-
PSL 2026 Final: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. కెప్టెన్గా తొలి పీఎస్ఎల్ ట్రోఫీ అందుకున్న బాబర్ ఆజం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!