Vivek Venkataswamy: కేసీఆర్ రాత్రి ఏదో ఆలోచిస్తారు.. ఉదయం మరోలా ఉంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Venkataswamy Sensational Comments On KCR: తెలంగాణ సీఎం కేసీఆర్పై మునుగోడు ఉపఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ఆయన నిద్ర లేచారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాత్రికి ఏదో ఆలోచిస్తారని, ఉదయం మరోలా ప్రవర్తిస్తారని అన్నారు. ఓట్ల కోసం కొత్త కొత్త పన్నాగాలు పన్నుతారని ఆరోపించారు. టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమకారులకు విలువ లేదన్న ఆయన.. డబ్బుతో కేసీఆర్ని కలిసి వాళ్లకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని, వరదల్లో నష్టపోయిన బాధితులకు ఒక్కొ్క్కరికి రూ.10,000 ఇస్తానని ఇచ్చిన హామీ కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదన్నారు.
రాజ్యసభ సీట్లను అమ్ముకోవడంతో పాటు మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారని వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత వాటర్ ట్యాంక్లకు కలర్ వేసి.. తానే అపర భగీరథుడ్ని అని కేసీఆర్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్లో ఉప ఎన్నికలు ముగిశాక.. అక్కడి ప్రజలను పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి అమలుకాకపోవడం దారుణమని, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించడం లేదన్నారు. ప్రజలపై భారం వేసి. కేంద్రం పై ఆరోపణలు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. చర్లగూడెం, డిండి భూ నిర్వాసితులకు పరిహారం అందకపోవడంతో.. స్థానికులు ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారన్నారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత డబ్బుతో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని.. ఈ విషయం ప్రజలకు తెలుసని వివేక్ వెంకటస్వామి అన్నారు. మంత్రి KTR అభద్రతతో మాట్లాడుతున్నారని, ధరణి పోర్టల్ తీసుకొచ్చి రూ.18 లక్షల కోట్ల స్కామ్ చేశారని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అటు.. లిక్కర్ స్కామ్లో అరెస్టైన అభిషేక్ రావు, ఎమ్మెల్సీ కవితకి బినామీ అంటూ ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్కు మునుగోడు ప్రజలు తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధమయ్యారని.. ఓట్లకోసం వచ్చే కేసీఆర్ను ఇంటికి సాగనంపడం ఖాయమని జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!