Vijayashanti: జనం ఇబ్బంది పడుతుంటే.. కేసీఆర్ ఫామ్హౌస్లో విశ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayashanti Fires On CM KCR Over Telangana Heavy Rains: తెలంగాణ సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారీ వర్షాల కారణంగా జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ మాత్రం ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు జనాల కష్టాలు ఏమాత్రం పట్టడం లేదని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. భారీ వర్షాల గురించి వాతావరణ శాఖ తరచూ హెచ్చరికలు జారీ చేస్తోన్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతోందని ఆగ్రహించారు.
‘‘హైదరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా వరద నీరే ఉంది. రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంతో, వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని దుస్థితి నెలకొంది. సీఎం గద్దెనెక్కినప్పటి నుంచి హైదరాబాద్ను డల్లాస్ చేస్తానని కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. ఆ డల్లాస్ అంటే ఇదేనా?’’ అంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుంటే.. మీరు ఫామ్హౌస్లో రెస్ట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? అని నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజల కష్టాల్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ వాఖ ప్రకటించినా.. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందన్నారు.
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
మొన్నటి వరకు భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయితే.. టీఆర్ఎస్ ప్ఱభుత్వం మాత్రం కేవలం భద్రాచలంలోనే నష్టం జరిగినట్టు చూపిస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని విజయశాంతి చెప్పారు. హైదరాబాద్లోనూ అలాంటి ప్రయత్నమే చేస్తోందన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తోంటే.. కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విజయశాంతి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..