Vijayashanti: జనం ఇబ్బంది పడుతుంటే.. కేసీఆర్ ఫామ్హౌస్లో విశ్రాంతి
Vijayashanti Fires On CM KCR Over Telangana Heavy Rains: తెలంగాణ సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారీ వర్షాల కారణంగా జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ మాత్రం ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు జనాల కష్టాలు ఏమాత్రం పట్టడం లేదని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. భారీ వర్షాల గురించి వాతావరణ శాఖ తరచూ హెచ్చరికలు జారీ చేస్తోన్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతోందని ఆగ్రహించారు.
‘‘హైదరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా వరద నీరే ఉంది. రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంతో, వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని దుస్థితి నెలకొంది. సీఎం గద్దెనెక్కినప్పటి నుంచి హైదరాబాద్ను డల్లాస్ చేస్తానని కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. ఆ డల్లాస్ అంటే ఇదేనా?’’ అంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుంటే.. మీరు ఫామ్హౌస్లో రెస్ట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? అని నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజల కష్టాల్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ వాఖ ప్రకటించినా.. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందన్నారు.
Also Read
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
- Kavitha: కవిత 'TRS' పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
మొన్నటి వరకు భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయితే.. టీఆర్ఎస్ ప్ఱభుత్వం మాత్రం కేవలం భద్రాచలంలోనే నష్టం జరిగినట్టు చూపిస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని విజయశాంతి చెప్పారు. హైదరాబాద్లోనూ అలాంటి ప్రయత్నమే చేస్తోందన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తోంటే.. కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విజయశాంతి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
-
Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
-
Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
-
Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
-
Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!