Vijayashanti: జనం ఇబ్బంది పడుతుంటే.. కేసీఆర్ ఫామ్హౌస్లో విశ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayashanti Fires On CM KCR Over Telangana Heavy Rains: తెలంగాణ సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారీ వర్షాల కారణంగా జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ మాత్రం ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు జనాల కష్టాలు ఏమాత్రం పట్టడం లేదని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. భారీ వర్షాల గురించి వాతావరణ శాఖ తరచూ హెచ్చరికలు జారీ చేస్తోన్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతోందని ఆగ్రహించారు.
‘‘హైదరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా వరద నీరే ఉంది. రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంతో, వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని దుస్థితి నెలకొంది. సీఎం గద్దెనెక్కినప్పటి నుంచి హైదరాబాద్ను డల్లాస్ చేస్తానని కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. ఆ డల్లాస్ అంటే ఇదేనా?’’ అంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుంటే.. మీరు ఫామ్హౌస్లో రెస్ట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? అని నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజల కష్టాల్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ వాఖ ప్రకటించినా.. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందన్నారు.
Also Read
- Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
మొన్నటి వరకు భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయితే.. టీఆర్ఎస్ ప్ఱభుత్వం మాత్రం కేవలం భద్రాచలంలోనే నష్టం జరిగినట్టు చూపిస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని విజయశాంతి చెప్పారు. హైదరాబాద్లోనూ అలాంటి ప్రయత్నమే చేస్తోందన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తోంటే.. కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విజయశాంతి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!