V Hanumantha Rao: ఆనాడు గోవర్ధన్ రెడ్డిని కాదని.. రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Comments On Rajagopal Reddy: నల్లగొండ జిల్లాలోని గట్టుపల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వాల్సి ఉండగా.. చివరి క్షణంలో రాజగోపాల్ రెడ్డికి ఇచ్చామన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారో తనకు ఇప్పటివరకూ అర్థం కాలేదన్నారు.
నువ్వు బీజేపీతో చేరితే నీకు కష్టమవ్వడంతో పాటు మీ అన్నయ్యకి కూడా నష్టం జరుగుతుందని తాను రాజగోపాల్ రెడ్డికి వీ హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి.. పార్టీకి నష్టం చేయొద్దని కూడా తాను విజ్ఞప్తి చేశానని తెలిపారు. అయినా రాజగోపాల్ వినిపించుకోకుండా బీజేపీలో చేరారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మహానీయుడని.. ఆయన ఆనాడు ఏమాత్రం కాంప్రమైజ్ అయినా ముఖ్యమంత్రి అయ్యుండేవారని అన్నారు. వారి సామాజిక వర్గానికి న్యాయం చేస్తే, కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అవుతుందన్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోన్న పాల్వాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజల్ని ఆయన కోరారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
కాగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెగ కసరత్తు చేస్తున్నాయి. మునుగోడు ప్రజల్ని ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నాయి. బీజేపీ విస్తృతస్థాయిలో ప్రయత్నలు చేస్తోంది. ఎలాగైనా మునుగోడులో చక్రం తిప్పాలని, అక్కడ గెలిస్తే టీఆర్ఎస్కి గట్టి దెబ్బ తగిలినట్టు అవుతుందని బీజేపీ భావిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం తనదైన వ్యూహాలతో దూసుకెళ్తోంది. తామూ ఏం తక్కువ కాదన్నట్టు.. కాంగ్రెస్ కూడా ధీటుగా ముందుకు సాగుతోంది. దీంతో.. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..