Uttam Kumar Reddy: జనవరిలో శాసనసభ రద్దయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలలో భాగంగా వచ్చే జనవరిలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దయ్యే అవకాశం ఉందని PCC మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. శాసన సభ రద్దవ్వగానే మే నెలలోనే ఎలక్షన్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల్లో 50 వేల పైచిలుకు మెజారిటీతో తాను గెలవబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ పై ప్రజలు తిరగబడే రోజులు ముందున్నాయని ఉత్తమ్ తెలిపారు.
అయితే ఇదే క్రమంలో ఎస్పీ, కలెక్టర్, ఎమ్మెల్యే పై మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్పీ, కలెక్టర్ ఎవరు ఆదేశాలతో నేరేడుచర్ల లో మనుషులందరూ నిద్రిస్తున్న సమయంలో వచ్చి ఇల్లు కూలగొట్టారు.పది గజాలు 20 గజాల్లో కట్టుకున్న ఇళ్లపై ఇంత క్రూరత్వంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని ఎస్పీ, కలెక్టర్లపై ధ్వజమెత్తారు ఉత్తమ్.
Also Read
నిజంగా మీరు నిజమైన ఉద్యోగాలు చేయదలుచుకుంటే హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆయన అనుచరులు సుమారు 100 ఎకరాలు ఆక్రమించారు వాటిపై కూడా ఇదే స్థాయిలో అధికారులు స్పందిస్తే దాన్ని ప్రజలు కూడా అభినందిస్తారు..అంతేకాని ఇలాంటి చర్యలు చేయడం అమానుషం. నా 30 సంవత్సరాల రాజకీయాల్లో ఇలాంటివి ఎన్నడూ చూడలేదు అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.
ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఆయన గాని రాష్ట్ర ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తోంది అని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా తమ బాధ్యతలను మరిచి పూర్తి స్థాయిలో అధికార పార్టీకి తొత్తులుగా మారి అధికార పార్టీకే మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేదలకు న్యాయం జరిగే పరిస్థితి ఎక్కడా కనబడటంలేదని ఉత్తమ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.
ఇక తాను రైతు భరోసా కార్యక్రమంతో హుజూర్నగర్ నియోజకవర్గంలోని సుమారు 90 గ్రామ పంచాయతీలను చుట్టి రావడం జరిగిందని ఏ గ్రామానికి వెళ్లినా అడుగడుగునా టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని ప్రజల ఎత్తి చూపిస్తున్నారని మళ్లీ తామే అధికారం లోకి వస్తాం అని ఉత్తమ్ ఈ మీడియా సమావేశంలో తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!