Uttam Kumar Reddy : జరిగింది జరిగి పోయింది.. ఇక అందరం కలిసి పని చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాలో ఉన్న విబేధాలపై రాహుల్ గాంధీతో చర్చ జరిగిందని, జరిగింది జరిగి పోయింది. ఇక అందరం కలిసి పని చేస్తామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్, ఎంఐఎం లతో సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు, రాహుల్ టికెట్లు అనౌన్స్ చేస్తారని ఆయన వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కలిసి రాహుల్ గాంధీని కలిశామని, రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు సుదీర్ఘంగా చర్చించామన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడాలని రాహుల్ గాంధీ సూచించారని, మతం ముసుగులో రాజకీయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీని తెలంగాణ పొలిమేరలో రాకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలో తెలంగాణ సమాజంలో విభజిస్తున్నాయని, బీజేపీ, టీఆర్ఎస్ లకు వ్యతిరేకంగా ప్రతి గ్రామానికి వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారని ఆయన పేర్కొన్నారు. నాయకుల మధ్య లో ఉన్న చిన్న చిన్న అభిప్రాయాలను పక్కన పెట్టాలని రాహుల్ గాంధీ తెలిపారని, అన్ని సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దామన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!