Kishan Reddy Padayatra: కిషన్ రెడ్డి పాదయాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Kishan Reddy Padayatra: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభమైంది. ప్రజలు, స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇవాళ సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది. ఇక రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర నిర్వహిస్తారు. అయితే.. సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, తుకారంగేట్ బస్తీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. డబుల్బెడ్రూం ఇళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని మంత్రి చెప్పారు.
గతంలో నేను రాసినలేఖకు స్పందించి తెలంగాణలో గేట్ పరీక్షాకేంద్రాలను పెంచుతూ నిర్ణయంతీసుకున్న @EduMinOfIndia శ్రీ @dpradhanbjp గారికి,గేట్-2023 పరీక్షలనిర్వహణ కమిటీకి కృతజ్ఞతలు.
Also Read
విద్యార్థులు ఇకపై పూర్తిసమయాన్ని పరీక్షలకు సన్నద్ధంఅవటంపై కేటాయించి మంచిఉత్తీర్ణత సాధించాలనికోరుతున్నాను. pic.twitter.com/jtWBxSD4aW
— G Kishan Reddy (@kishanreddybjp) November 26, 2022
తెలంగాణ రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ మేరకు నవంబరు నిన్న(26)న ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే.. కొత్తగా మెదక్, నల్గొండ, అదిలాబాద్, కొత్తగూడెంలలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో తాను రాసిన లేఖకు స్పందించారని ఈ క్రమంలోనే గేట్-2023 పరీక్షల నిర్వహణ కమిటీ తాజా నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విద్యార్థులు పూర్తి సమయాన్ని సన్నద్ధతకు కేటాయించి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ నగరాల్లోనే గేట్ పరీక్ష నిర్వహించేవారు. ఈ సందర్భంలో పరీక్ష రాసేందుకు తెలంగాణ విద్యార్థులు వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్న తీరును వివరిస్తూ కిషన్ రెడ్డి లేఖ రాయడంతో తాజా నిర్ణయం వెలువడింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!