Kishan Reddy: నా ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం రాహుల్ కు ఉందా? చర్చకు సిద్దమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: రాహుల్ గాంధీకి దమ్ము దైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, రాహుల్ చర్చలు సిద్దమా? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి రాహుల్ కు సవాల్ విసిరారు. తెలంగాణలో రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారని తెలిపారు. రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా పిఎం మోడీకి ధన్యవాదాలు తెలపాలని అన్నారు. రామప్ప దేవాలయాన్ని పీఎం అభివృద్ధి చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్, ప్రియాంక లు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్ కు జ్ఞాపక శక్తి తగ్గినట్లు ఉందని, రాహుల్ కు మతిమరుపు పెరిగిందని అన్నారు. వాస్తవాలు మర్చి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కు కొన్ని ప్రశ్నలు అడుగుతున్న.. రాహుల్ కు దమ్ము దైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. 2004లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టు కాలేదా? అధికారం పంచుకోలేదా? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉంటే కేసీఆర్ కేంద్ర మంత్రిగా లేరా? రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ లో టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులు కాలేదా? 2014 లో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మేల్యేలు.. ఏ పార్టీలోకి వెళ్లి చేరారు? ఎవరికి ఓటు వేస్తే ఎవరికి లాభం జరిగింది? కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మేల్యేలు టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు మడుగులు వత్త లేదా? అంటూ ప్రశ్నించారు.
ఎవరికి ఎవరు బిటిమ్.. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బిటీమ్ అన్నారు. 2013 లో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో మెర్జ్ చేసేందుకు చర్చలు జరగలేదా? అని ప్రశ్నించారు. ఎవరికి ఎవరు బిటిమో రాహుల్ చెప్పాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ పై ఓటుకు నోటు కేసు ఏమయింది? ఎందుకు తొక్కి పెట్టారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మధ్యవర్తిగా మజ్లిస్ ను పెట్టుకున్నారని మండిపడ్డారు. మూడు పార్టీలు కలిసి అట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీల DNA ఒక్కటే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి అవగాహనతో మూడు పార్టీలు పని చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాహుల్ చర్చలు సిద్దమా? అని సవాల్ విసిరారు. డిల్లీ ఐనా, హైదరాబాద్ అయినా రాహుల్ తో నేను చర్చకు సిద్దం అని అన్నారు. బీజేపీ జాబితా సిద్దం కాగానే చెప్తామని అన్నారు. రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గతం అన్నారు. సస్పెన్స్ ఎత్తివేస్తే రాజాసింగ్ పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమన్నారు. అభ్యర్థుల కసరత్తు ప్రారంభం చేశామన్నారు.
Tiger Nageswarara Rao : టైగర్ నాగేశ్వరావు గ్రాఫిక్స్ కోసం అంత టైం పట్టిందా..?
Also Read
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!