Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి.. భువనగిరి సభలో అమిత్ షా ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వరుస కడుతున్నారు. అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్రమంత్రి అమిత్ షా ఇవాళ (బుధవారం) రాత్రి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ రాత్రి హైదరాబాద్లోనే బస చేస్తారు. రేపు గురువారం (మే 9) అమిత్ షా తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. భువనగిరిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్ననున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు.
Read also: Darshini: మే 17న థియేటర్లలోకి థ్రిల్లర్ ‘దర్శిని’
Also Read
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ఇక ఈ సభలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా స్థానిక రాయిగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. అమిత్ షా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భువనగిరి స్థానిక బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ మేరకు పట్టణ శివారులోని స్పిన్నింగ్ మిల్ వద్ద ఉన్న హెలిప్యాడ్ ను బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పాసం భాస్కర్, గూడూరు నారాయణరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరితో పాటు కేంద్రంలో భాజపా విజయం సాధిస్తుందన్నారు. అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమిత్ రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్ మల్లింపు ఉంటుందని, వాహనదారులు గమనించాలని కోరారు. అమిత్ షా సభ దృష్ట్యా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. వాహనదారులు సహకరించాలని తెలిపారు.
CM Revanth Reddy: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి.. బాచుపల్లి ఘటనపై సీఎం సీరియస్
తాజావార్తలు
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..