Amit Shah: 29న నగరానికి ‘షా’.. కిషన్ రెడ్డి బాధ్యతలు అనంతరం తొలిసారి తెలంగాణకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ వర్గాల నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపై నేతలతో చర్చించనున్నారు. పార్టీ నేతలతో సంస్థాగత అంశాలపై అమిత్ షా చర్చించనున్నారు. పార్టీలోని వివిధ వర్గాల సీనియర్లతో అమిత్ షా సమావేశం కానున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఈ నెల 26న జరగనుంది. ఈ సమావేశంలో ఎన్నికల కమిటీలను ఖరారు చేయనున్నారు. ఈ కమిటీలతో అమిత్ షా సమావేశం కానున్నారు.
Read also: Rajanna Sircilla: పునుగులు తింటూ 13 నెలల చిన్నారి మృతి..
Also Read
- Harish Rao: "త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా".. హరీష్ రావు సంచలన ప్రకటన..
- Bhatti Vikramarka: సింగరేణి బొగ్గు గనుల వివాదం.. కేంద్ర ప్రకటనలపై డిప్యూటీ సీఎం ఫైర్
- Kadiyam Srihari: "నేనేం తప్పు చేయలేదు".. మంత్రి కొండా సురేఖ లేఖపై స్పందించిన కడియం శ్రీహరి
- Harish Rao: మెచ్చుకోవాల్సింది పోయి.. ఏంటి ఈ చిల్లర రాజకీయాలు.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. ఈ దిశగా పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ నేతలతో అమిత్ షా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించారు. ప్రధాని పర్యటన ముగిసిన మరుసటి రోజే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల పార్టీ నేతలతో నడ్డా సమావేశమయ్యారు. దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఖమ్మంలో భాజపా ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అమిత్ షా పర్యటన వాయిదా పడింది. దీంతో ఖమ్మం సభ రద్దయింది. అయితే అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. ఈ ఘట్టం అమిత్ షా పార్టీ సంస్థాగత అంశాలకే పరిమితం కానుందని సమాచారం.
Polavaram: ఏపీకి తెలంగాణ లేఖ.. పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచాలి..
తాజావార్తలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
-
Harish Rao: “త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా”.. హరీష్ రావు సంచలన ప్రకటన..
-
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
-
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
-
Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..