Durga Matha Idol Vandalised: దుర్గా మాత విగ్రహంపై దాడి.. ఇద్దరు మహిళలు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Woman Arrested In Hyderabad Who Vandalised Durga Idol In Burkha: హైదరాబాద్లో నవరాత్రి ఉత్సవాల్లో ఓ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు.. ఖైరతాబాద్లో దుర్గా మాత మండపంపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో సింహం విగ్రహం తల భాగం పాక్షికంగా దెబ్బతింది. స్థానికులు వారిని అడ్డుకొని, పోలీసులకు సమాచారం అందించారు. దాడి చేసిన మహిళలు బుర్ఖా ధరించడం ఉండటంతో.. ఇది మత సంఘర్షణలు దాడి తీయొచ్చన్న ఉద్దేశంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆ ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. ఆ మహిళలకు మతిస్థిమితం లేదని గుర్తించారు.
ఈ వ్యవహారంపై సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ మాట్లాడుతూ.. సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో దుర్గా మాత విగ్రహంపై దాడి చేసిన మహిళల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. దర్యాప్తులో ఆ ఇద్దరికి మతిస్థిమితం లేదని గుర్తించామన్నారు. విచారణలో భాగంగా.. ఆ మహిళలు సైపోతేమియా అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తేలిందన్నారు. మెడికల్ రిపోర్ట్స్ని వెరిఫై చేస్తున్నామన్నారు. ఇరుగు పొరుగు వారిని సైతం విచారించామని, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని తెలిపారు. ఆ ఇద్దరు మహిళల సోదరుడు పోలీస్ స్టేషన్కు వచ్చి వివరణ ఇచ్చాడన్నారు. నాలుగు సంవత్సరాత క్రితం కూడా ఆ మహిళలు ఇలాగే ప్రవర్తించారని.. అప్పుడు చర్చిల్లో విగ్రహాల్ని సైతం ధ్వంసం చేసినట్టు తేలిందని చెప్పారు.
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
ఈ కేసులో ముడు టీమ్స్ సిద్ధం చేశామని, పూర్తి విచారణ జరుపుతున్నామని డీసీపీ తెలిపారు. ఇందులో ఏవేవో పుకార్లు, వదంతులు చక్కర్లు కొడుతున్నాయని.. వాటిని ఎవ్వరూ నమ్మకండని పిలుపునిచ్చారు. ఐపిసి సెక్షన్ 153(a), 295 & 295(a), 451, 504, 34(r) కింద కేసు నమోదు చేసుకుని చేస్తున్నామన్నారు. ఆ ఇద్దరు మహిళల్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి, గౌరవ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ రాజేష్ వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?