Nalgonda Crime: నల్గొండ జిల్లాలో విషాదం.. ఇద్దరు డిగ్రీ విద్యార్థినిలు సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Crime: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ రాజీవ్ పార్క్లో మంగళవారం ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు విద్యార్థినిలు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండలానికి చెందిన ఇద్దరు బాలికలు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. ఇటీవల సెలవుల కారణంగా గత 20 రోజులుగా ఇంటి వద్దనే ఉన్న వీరిద్దరు కళాశాలకు వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పి మంగళవారం (సెప్టెంబర్ 5) కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని చెప్పడంతో నల్గొండ చేరుకున్నారు. ఆ తర్వాత నాగార్జున కాలేజీ వెనుక ఉన్న రాజీవ్ పార్కు వద్దకు వెళ్లారు. తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును తాగారు. బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అనంతరం పార్క్ గేటు బయట చెట్టుకింద కుప్పకూలిపోయాడు.
Read also: Health Tips: స్ట్రాబెర్రీలతో ఆ సమస్యలకు చెక్..
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. తమ పిల్లలకు ఎవరితోనూ పరిచయం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నామో అర్థం కావడం లేదని విలపిస్తున్నారు. అయితే అమ్మాయిల వాట్సాప్ డీపీ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి బెదిరించి ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటాను పరిశీలించారు. వారిని ఎవరైనా నిజంగా బ్లాక్ మెయిల్ చేశారా? మరేదైనా కారణంతో వారు చనిపోయారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే వారి ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా.. ఇద్దరు విద్యార్థినులు మధ్యే ఎక్కువగా ఫోన్ సంభాషణ ఉన్నట్లు తెలిసింది. వారి బ్యాగులో నిద్రమాత్రలు లభించాయని పోలీసులు తెలిపారు. విద్యార్థినులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..