Nalgonda Crime: నల్గొండ జిల్లాలో విషాదం.. ఇద్దరు డిగ్రీ విద్యార్థినిలు సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Crime: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ రాజీవ్ పార్క్లో మంగళవారం ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు విద్యార్థినిలు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండలానికి చెందిన ఇద్దరు బాలికలు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. ఇటీవల సెలవుల కారణంగా గత 20 రోజులుగా ఇంటి వద్దనే ఉన్న వీరిద్దరు కళాశాలకు వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పి మంగళవారం (సెప్టెంబర్ 5) కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని చెప్పడంతో నల్గొండ చేరుకున్నారు. ఆ తర్వాత నాగార్జున కాలేజీ వెనుక ఉన్న రాజీవ్ పార్కు వద్దకు వెళ్లారు. తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును తాగారు. బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అనంతరం పార్క్ గేటు బయట చెట్టుకింద కుప్పకూలిపోయాడు.
Read also: Health Tips: స్ట్రాబెర్రీలతో ఆ సమస్యలకు చెక్..
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. తమ పిల్లలకు ఎవరితోనూ పరిచయం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నామో అర్థం కావడం లేదని విలపిస్తున్నారు. అయితే అమ్మాయిల వాట్సాప్ డీపీ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి బెదిరించి ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటాను పరిశీలించారు. వారిని ఎవరైనా నిజంగా బ్లాక్ మెయిల్ చేశారా? మరేదైనా కారణంతో వారు చనిపోయారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే వారి ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా.. ఇద్దరు విద్యార్థినులు మధ్యే ఎక్కువగా ఫోన్ సంభాషణ ఉన్నట్లు తెలిసింది. వారి బ్యాగులో నిద్రమాత్రలు లభించాయని పోలీసులు తెలిపారు. విద్యార్థినులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?