Nalgonda Crime: నల్గొండ జిల్లాలో విషాదం.. ఇద్దరు డిగ్రీ విద్యార్థినిలు సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Crime: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ రాజీవ్ పార్క్లో మంగళవారం ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు విద్యార్థినిలు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండలానికి చెందిన ఇద్దరు బాలికలు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. ఇటీవల సెలవుల కారణంగా గత 20 రోజులుగా ఇంటి వద్దనే ఉన్న వీరిద్దరు కళాశాలకు వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పి మంగళవారం (సెప్టెంబర్ 5) కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని చెప్పడంతో నల్గొండ చేరుకున్నారు. ఆ తర్వాత నాగార్జున కాలేజీ వెనుక ఉన్న రాజీవ్ పార్కు వద్దకు వెళ్లారు. తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును తాగారు. బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అనంతరం పార్క్ గేటు బయట చెట్టుకింద కుప్పకూలిపోయాడు.
Read also: Health Tips: స్ట్రాబెర్రీలతో ఆ సమస్యలకు చెక్..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. తమ పిల్లలకు ఎవరితోనూ పరిచయం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నామో అర్థం కావడం లేదని విలపిస్తున్నారు. అయితే అమ్మాయిల వాట్సాప్ డీపీ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి బెదిరించి ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటాను పరిశీలించారు. వారిని ఎవరైనా నిజంగా బ్లాక్ మెయిల్ చేశారా? మరేదైనా కారణంతో వారు చనిపోయారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే వారి ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా.. ఇద్దరు విద్యార్థినులు మధ్యే ఎక్కువగా ఫోన్ సంభాషణ ఉన్నట్లు తెలిసింది. వారి బ్యాగులో నిద్రమాత్రలు లభించాయని పోలీసులు తెలిపారు. విద్యార్థినులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!