Rangareddy crime: హైదరాబాద్ లో మిస్సింగ్ కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy crime: రాజేంద్ర నగర్లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపిన విషయం మరువక ముందే.. మరో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపింది. ఇద్దరు చిన్నారులే కావడంతో రాజేంద్ర నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ డాక్టర్స్ కాలనీలో 9వ తరగతి విద్యార్థి కిడ్నాప్ కి గురయ్యాడు. ఇంట్లోనే ఆడుకుంటున్నాడని భావించిన తల్లిదండ్రులు ఇంట్లో వెతగ్గా చిన్నారి ఎక్కడా కనిపించాలేదు. బయటకు వచ్చి చూసిన ఫలితం కనిపించకుండా పోయింది. అయితే కొందరు ఆటోలో చూసినట్లు తెలుపడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ ఆటోలో వెళ్లినట్లు తెలుపడంతో.. సీసీటీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు. తన కొడుకును వెంటనే తమ దగ్గరకు చేర్పించాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read also: Dasara: వెన్నెల డాన్స్ ఇంకా బుర్రలో తిరుగుతూనే ఉంది మాష్టారు…
Also Read
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
- Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ఇక ఇలాంటి మరోఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ లో చోటుచేసుకుంది. గాయత్రి అనే యువతి మిస్సింగ్ కలకలం రేపింది. బజార్ కు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన యువతి రాత్రి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల, బంధువులకు ఫోన్ చేసి వకాబు చేయగా ఎక్కడా తమ కూతురు ఆచూకీ తెలియక పోవడంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి బజార్ కు వెళతానని చెప్పిన గాయత్రి వారి స్నేహితల ఇంటి వెళ్లిందా? లేక గాయాత్రిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు ఉన్న యువతులు, చిన్నారుల కిడ్నాప్ లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కవ మిస్సింగ్ కేసులు రావడంతో పోలీసులకు సవాల్గా మారింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న ఫలితం లేకుండా పోతోంది. పోలీసుల తీరుపై నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇలా రోజుకో మిస్సింగ్ కేసులు నమోదు అవతున్న పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న చిన్నారుల, యువతుల జాడను తెలుసుకోలేపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రంగారెడ్డి జిల్లాలో పోలీసుల పహారా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Mughals Out Of Syllabus: సీబీఎస్ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర తొలగింపు..
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..