Rangareddy crime: హైదరాబాద్ లో మిస్సింగ్ కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy crime: రాజేంద్ర నగర్లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపిన విషయం మరువక ముందే.. మరో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపింది. ఇద్దరు చిన్నారులే కావడంతో రాజేంద్ర నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ డాక్టర్స్ కాలనీలో 9వ తరగతి విద్యార్థి కిడ్నాప్ కి గురయ్యాడు. ఇంట్లోనే ఆడుకుంటున్నాడని భావించిన తల్లిదండ్రులు ఇంట్లో వెతగ్గా చిన్నారి ఎక్కడా కనిపించాలేదు. బయటకు వచ్చి చూసిన ఫలితం కనిపించకుండా పోయింది. అయితే కొందరు ఆటోలో చూసినట్లు తెలుపడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ ఆటోలో వెళ్లినట్లు తెలుపడంతో.. సీసీటీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు. తన కొడుకును వెంటనే తమ దగ్గరకు చేర్పించాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read also: Dasara: వెన్నెల డాన్స్ ఇంకా బుర్రలో తిరుగుతూనే ఉంది మాష్టారు…
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
ఇక ఇలాంటి మరోఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ లో చోటుచేసుకుంది. గాయత్రి అనే యువతి మిస్సింగ్ కలకలం రేపింది. బజార్ కు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన యువతి రాత్రి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల, బంధువులకు ఫోన్ చేసి వకాబు చేయగా ఎక్కడా తమ కూతురు ఆచూకీ తెలియక పోవడంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి బజార్ కు వెళతానని చెప్పిన గాయత్రి వారి స్నేహితల ఇంటి వెళ్లిందా? లేక గాయాత్రిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు ఉన్న యువతులు, చిన్నారుల కిడ్నాప్ లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కవ మిస్సింగ్ కేసులు రావడంతో పోలీసులకు సవాల్గా మారింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న ఫలితం లేకుండా పోతోంది. పోలీసుల తీరుపై నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇలా రోజుకో మిస్సింగ్ కేసులు నమోదు అవతున్న పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న చిన్నారుల, యువతుల జాడను తెలుసుకోలేపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రంగారెడ్డి జిల్లాలో పోలీసుల పహారా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Mughals Out Of Syllabus: సీబీఎస్ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర తొలగింపు..
తాజావార్తలు
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!