Tummala-Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ..
- ఐదు గ్రామాల విలీనంపై కీలక చర్చలు
- భద్రాచలం కరకట్ట, పెద్దవాగు ప్రాజెక్ట్ అంశాలు
- 85:15 నిష్పత్తిలో వ్యయభారం ప్రతిపాదన
- తిరుమల వసతి, రైల్వే లైన్లపై విజ్ఞప్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా భౌగోళిక, పరిపాలనా సమస్యలను ఎదుర్కొంటున్న ఐదు గ్రామ పంచాయతీల విలీనంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు భౌగోళికంగా తెలంగాణ భూభాగం మధ్యలో ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి వివరించారు. ఈ గ్రామాలు ఏపీకి ‘ఎంక్లేవ్’లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే ప్రజలు 8 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోందని, అందువల్ల పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.
దీంతో పాటు భక్తుల భద్రత , సాగునీటి రంగాలకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించే కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతినడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతం ఏపీ పరిధిలో ఉండటం వల్ల నిర్వహణ సమస్యలు వస్తున్నాయని, తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 16 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దవాగు ప్రాజెక్ట్ పునరుద్ధరణ కోసం అయ్యే రూ.92.20 కోట్ల వ్యయాన్ని రెండు రాష్ట్రాలు 85:15 నిష్పత్తిలో భరించాలని ప్రతిపాదించారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కింద సాగయ్యే భూమిలో 85 శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటంతో, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
Also Read
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
చివరగా ఆధ్యాత్మిక , మౌలిక వసతుల కల్పనపై మంత్రి కీలక విజ్ఞప్తులు చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తుల వసతి కోసం సుమారు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరడంతో పాటు, ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి టీటీడీ సహకరించాలని అభ్యర్థించారు. అలాగే సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్ల నిర్మాణానికి రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల చేసిన ఈ ప్రతిపాదనల పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో, సాగునీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , భక్తుల సౌకర్యాల విషయంలో త్వరలోనే వేగవంతమైన పురోగతి లభిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!