Tummala-Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ..
- ఐదు గ్రామాల విలీనంపై కీలక చర్చలు
- భద్రాచలం కరకట్ట, పెద్దవాగు ప్రాజెక్ట్ అంశాలు
- 85:15 నిష్పత్తిలో వ్యయభారం ప్రతిపాదన
- తిరుమల వసతి, రైల్వే లైన్లపై విజ్ఞప్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా భౌగోళిక, పరిపాలనా సమస్యలను ఎదుర్కొంటున్న ఐదు గ్రామ పంచాయతీల విలీనంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు భౌగోళికంగా తెలంగాణ భూభాగం మధ్యలో ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి వివరించారు. ఈ గ్రామాలు ఏపీకి ‘ఎంక్లేవ్’లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే ప్రజలు 8 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోందని, అందువల్ల పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.
దీంతో పాటు భక్తుల భద్రత , సాగునీటి రంగాలకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించే కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతినడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతం ఏపీ పరిధిలో ఉండటం వల్ల నిర్వహణ సమస్యలు వస్తున్నాయని, తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 16 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దవాగు ప్రాజెక్ట్ పునరుద్ధరణ కోసం అయ్యే రూ.92.20 కోట్ల వ్యయాన్ని రెండు రాష్ట్రాలు 85:15 నిష్పత్తిలో భరించాలని ప్రతిపాదించారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కింద సాగయ్యే భూమిలో 85 శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటంతో, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
Also Read
- KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
- Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
- Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.. చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
చివరగా ఆధ్యాత్మిక , మౌలిక వసతుల కల్పనపై మంత్రి కీలక విజ్ఞప్తులు చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తుల వసతి కోసం సుమారు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరడంతో పాటు, ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి టీటీడీ సహకరించాలని అభ్యర్థించారు. అలాగే సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్ల నిర్మాణానికి రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల చేసిన ఈ ప్రతిపాదనల పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో, సాగునీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , భక్తుల సౌకర్యాల విషయంలో త్వరలోనే వేగవంతమైన పురోగతి లభిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
Nokia 100 (2026): నోకియా 100 విడుదలకు ముందే లీక్.. LED ఫ్లాష్లైట్, 1,020mAh బ్యాటరీతో కొత్త ఫీచర్ ఫోన్!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ ‘IAM GAME’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!