Tummala-Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ..
- ఐదు గ్రామాల విలీనంపై కీలక చర్చలు
- భద్రాచలం కరకట్ట, పెద్దవాగు ప్రాజెక్ట్ అంశాలు
- 85:15 నిష్పత్తిలో వ్యయభారం ప్రతిపాదన
- తిరుమల వసతి, రైల్వే లైన్లపై విజ్ఞప్తులు
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా భౌగోళిక, పరిపాలనా సమస్యలను ఎదుర్కొంటున్న ఐదు గ్రామ పంచాయతీల విలీనంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు భౌగోళికంగా తెలంగాణ భూభాగం మధ్యలో ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి వివరించారు. ఈ గ్రామాలు ఏపీకి ‘ఎంక్లేవ్’లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే ప్రజలు 8 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోందని, అందువల్ల పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.
దీంతో పాటు భక్తుల భద్రత , సాగునీటి రంగాలకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించే కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతినడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతం ఏపీ పరిధిలో ఉండటం వల్ల నిర్వహణ సమస్యలు వస్తున్నాయని, తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 16 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దవాగు ప్రాజెక్ట్ పునరుద్ధరణ కోసం అయ్యే రూ.92.20 కోట్ల వ్యయాన్ని రెండు రాష్ట్రాలు 85:15 నిష్పత్తిలో భరించాలని ప్రతిపాదించారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కింద సాగయ్యే భూమిలో 85 శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటంతో, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
చివరగా ఆధ్యాత్మిక , మౌలిక వసతుల కల్పనపై మంత్రి కీలక విజ్ఞప్తులు చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తుల వసతి కోసం సుమారు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరడంతో పాటు, ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి టీటీడీ సహకరించాలని అభ్యర్థించారు. అలాగే సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్ల నిర్మాణానికి రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల చేసిన ఈ ప్రతిపాదనల పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో, సాగునీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , భక్తుల సౌకర్యాల విషయంలో త్వరలోనే వేగవంతమైన పురోగతి లభిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?