Tummala Nageswara Rao: హైదరాబాద్ నుంచి ఖమ్మంకు తుమ్మల.. అనుచరులతో సమావేశమయ్యే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao: తుమ్మల నాగేశ్వరరావు భారీ కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరారు. ఖమ్మం వస్తున్న తమ నేతకు ఘనస్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాయకన్ గూడెంకు తరలివస్తున్నారు. 2 వేల కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఖమ్మంలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. తుమ్మల పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశించిన.. కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ ప్రకటించారు. దీంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల.. ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావులను శాంతింపజేసేందుకు హైదరాబాద్లోని తుమ్మల ఇంటికి పంపారు. ఇరువురు నేతలు తుమ్మలతో సమావేశమై చర్చించారు. అయితే తుమ్మల మాత్రం ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Read also: Uttam Kumar: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగబోతోంది.. ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
పాలేరు నుంచి తమ నేతకే టికెట్ వస్తుందని భావించినట్లు నాగేశ్వరరావు బంధువులు చెబుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1983 ఎన్నికల్లో ఓడిపోయారు. 1985, 1994, 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలుపొందారు. విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీగా, మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అప్పటి నుంచి తుమ్మల పాలేరు నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి మృతితో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో తుమ్మల పాలేరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి పోటీ చేసి బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. కానీ కేసీఆర్ తుమ్మలకు బదులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో తుమ్మల భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
Uttam Kumar: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగబోతోంది.. ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..