TSTDC: భక్తులకు టీఎస్ టీడీసీ గుడ్ న్యూస్.. శని ఆదివారాల్లో కార్తీకమాసం ట్రిప్స్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: ఆ పరమేశ్వరునికి కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం అని హిందువుల నమ్మకం. అందుకే కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు చేపడతారు భక్తులు. అలానే పుణ్య క్షేత్రాలను దర్శించుకోవడానికి కూడా మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో టీఎస్ టీడీసీ భక్తులకు ఓ శుభవార్త చెప్పింది. శని ఆదివారాల్లో కార్తీకమాసం ట్రిప్స్ ని నిర్వహించనుంది. వివరాలలోకి వెళ్తే.. కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ 5 యాత్రలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ మాట్లాడుతూ.. భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ 5 యాత్రలు చేపట్టిందని.. దీనిలో భాగంగా తెలంగాణ లోని ప్రముఖ దేవాలయాల దర్శనం తో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాల దర్శనం కూడా ఉంటుందని తెలిపారు.
Read also:Dharmana Krishna Das: పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
కాగా ఆహారం, అలానే ప్రవేశ టికెట్లకు అయ్యే ఖర్చులు ఎవరికీ వారు భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాల దర్శనం కోసం ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు బస్సు బయలు దేరుతుందని తెలిపిన ఆయన తిరిగి మంగళవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. కాగా బస్సు టికెట్ ధర పెద్దవాళ్లకు 4999 అలానే చిన్న పిల్లలకు 3999 అని వెల్లడించారు. అలానే శాతవాహన రీజియన్ పరిధి లోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దేవాలయాల దర్శనానికి శని, ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు బస్సు బయలు దేరుతుందని.. తిరిగి రాత్రి 10 గంటలకు బస్సు హైదరాబాద్ చేరుకుంటుందని తెలిపారు. కాగా బస్సు టికెట్ ధర పెద్దలకు 1999 కాగా చిన్నారులకు 1599 అని వెల్లడించారు. కాకతీయ రీజియన్ పరిధిలోని శైవ క్షేత్రాలతో పాటుగా ఇతర దేవాలయాల దర్శనానికి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు బస్సు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. మరిన్ని వివరాలకు 9848540371, 9848007020, 9848306435, 9848007031, 9848125720 నెంబర్లను సంప్రదించాల్సిందగా కోరారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!