Vc Sajjanar: ఖమ్మంలో ఆర్టీసీ ఎండీ తనిఖీలు. సెల్ఫీల కోసం క్యూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీసీ సజ్జనార్.. గతంలో పోలీస్ అధికారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన వ్యక్తి. ఆర్టీసీ రథసారథిగా బాధ్యతలు చేపట్టాక ప్రగతి రథాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆర్టీసీలో కూడా సమూల మార్పులు తీసుకుని వచ్చేందుకు, ఆర్టీసిని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సజ్జనార్ ఖమ్మంలో ఆర్టీసి బస్ స్టాండ్ ను ఆకస్మికంగా తనిఖి చేస్తే.. ఆయన వద్ద కు వచ్చి సెల్పీ ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. అంటే ఆర్లీసీలో కూడా ఆయన మార్క్ ప్రయాణికుల వద్ద కనిపిస్తోంది. ఆర్టీసీ ఎండీ అయిన తరువాత మొదటి సారి ఖమ్మం విచ్చేశారు. అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూర్, మహబూబాబాద్ జిల్లాల్లోని ఆర్టీసీ బస్ స్టేషన్లను కూడా తనిఖీలు చేశారు.
అనంతరం ఖమ్మం ఆర్టీసీ బస్ స్టాండ్ కు వచ్చి అక్కడ వున్న సమస్యలు, ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఇంకా చేయాల్సినవి ఏం ఉన్నాయి, అదే విధంగా ఆర్టీసీ బస్సులలో ఎటువంటి సౌకర్యాలను కల్పించాలో ప్రయాణికుల్ని అడిగి తెలుసుకున్నారు. సామాన్యులు ఎక్కే ప్యాసింజర్ బస్ ను ఎక్కి బసులో ఉన్న ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. బస్ లో అటు నుంచి ఇటు వైపు తిరిగారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
అంతే కాదు ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నంత సేపు ఆయనతో సెల్పీ లు దిగేందుకు ప్రయాణీకులు ఆసక్తి చూపించారు. ఓపికతో వారితో కలసి వారి వద్ద నుంచి ఆర్టీసి ఫీడ్ బ్యాక్ ను తీసుకున్నారు. చివరకు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సైతం సజ్జనార్ తో సెల్పీలు దిగారు. దాదాపుగా మూడుగా గంటల పాటు ఆర్టీసీ బస్ స్టేషన్ లో సజ్జనార్ గడిపారు. ప్రయాణికుల వద్ద నుంచి అదే విధంగా సిబ్బంది వద్ద నుంచి ఆర్టీసీ మెరుగుదల కోసం సలహాలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రతి ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. ఆర్టీసీ అందరిదీ, ఆర్టీసీని మరింతగా ప్రజలకు చేరువ చేయాలని, అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు సజ్జనార్. ఆర్టీసీ గతంలో కన్న మెరుగైన సేవలను అందిస్తున్నదని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన వుందని సజ్జనార్ అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!