Vc Sajjanar: ఖమ్మంలో ఆర్టీసీ ఎండీ తనిఖీలు. సెల్ఫీల కోసం క్యూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీసీ సజ్జనార్.. గతంలో పోలీస్ అధికారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన వ్యక్తి. ఆర్టీసీ రథసారథిగా బాధ్యతలు చేపట్టాక ప్రగతి రథాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆర్టీసీలో కూడా సమూల మార్పులు తీసుకుని వచ్చేందుకు, ఆర్టీసిని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సజ్జనార్ ఖమ్మంలో ఆర్టీసి బస్ స్టాండ్ ను ఆకస్మికంగా తనిఖి చేస్తే.. ఆయన వద్ద కు వచ్చి సెల్పీ ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. అంటే ఆర్లీసీలో కూడా ఆయన మార్క్ ప్రయాణికుల వద్ద కనిపిస్తోంది. ఆర్టీసీ ఎండీ అయిన తరువాత మొదటి సారి ఖమ్మం విచ్చేశారు. అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూర్, మహబూబాబాద్ జిల్లాల్లోని ఆర్టీసీ బస్ స్టేషన్లను కూడా తనిఖీలు చేశారు.
అనంతరం ఖమ్మం ఆర్టీసీ బస్ స్టాండ్ కు వచ్చి అక్కడ వున్న సమస్యలు, ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఇంకా చేయాల్సినవి ఏం ఉన్నాయి, అదే విధంగా ఆర్టీసీ బస్సులలో ఎటువంటి సౌకర్యాలను కల్పించాలో ప్రయాణికుల్ని అడిగి తెలుసుకున్నారు. సామాన్యులు ఎక్కే ప్యాసింజర్ బస్ ను ఎక్కి బసులో ఉన్న ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. బస్ లో అటు నుంచి ఇటు వైపు తిరిగారు.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
అంతే కాదు ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నంత సేపు ఆయనతో సెల్పీ లు దిగేందుకు ప్రయాణీకులు ఆసక్తి చూపించారు. ఓపికతో వారితో కలసి వారి వద్ద నుంచి ఆర్టీసి ఫీడ్ బ్యాక్ ను తీసుకున్నారు. చివరకు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సైతం సజ్జనార్ తో సెల్పీలు దిగారు. దాదాపుగా మూడుగా గంటల పాటు ఆర్టీసీ బస్ స్టేషన్ లో సజ్జనార్ గడిపారు. ప్రయాణికుల వద్ద నుంచి అదే విధంగా సిబ్బంది వద్ద నుంచి ఆర్టీసీ మెరుగుదల కోసం సలహాలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రతి ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. ఆర్టీసీ అందరిదీ, ఆర్టీసీని మరింతగా ప్రజలకు చేరువ చేయాలని, అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు సజ్జనార్. ఆర్టీసీ గతంలో కన్న మెరుగైన సేవలను అందిస్తున్నదని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన వుందని సజ్జనార్ అన్నారు.
తాజావార్తలు
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!