TSRTC Bumper Offer: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఇకపై ఆ చార్జీలుండవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC Bumper Offer: తెలంగాణ ప్రజలకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా సమీపంలోని పర్యాటక ప్రదేశాలు, పవిత్ర స్థలాలకు వెళుతుంటారు. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రహదారులపై రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు వాహనదారులు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మరింత భారంగా మారుతున్నాయి.
Read also: Amit Shah: రూల్స్ బ్రేక్ చేశారు.. అమిత్ షా పై కేసు నమోదు..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బఫర్ ఆఫర్ ప్రకటించింది. సిటీకి వెళ్లాలనుకునే వారు.. ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే.. ఎలాంటి రుసుము లేదని వెల్లడించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎనిమిది రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి రిజర్వేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు లభించడం విశేషం. ఈ మేరకు ఎక్స్ ట్వీట్ చేసింది. #TSRTC సుదూర ప్రయాణీకులకు రిజర్వేషన్ ఛార్జీలను మాఫీ చేస్తుంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది.
Read also: Rahul Gandhi: రాయ్బరేలీలో పోటీ చేయడంపై వయనాడ్ ప్రజలు ఏమంటున్నారంటే..!
TSRTC బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్సైట్ను సందర్శించండి” అని ఆయన ట్వీట్ చేశారు. యాత్రికుల నుంచి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్లకు 10 శాతం రాయితీ ప్రకటించింది. ఇప్పుడు ఈ ఆఫర్ ఇచ్చారు. ఏపీలోని శ్రీశైలంలో కూడా బస్సు సర్వీసులు, ఫ్రీక్వెన్సీ పెంచనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఉచిత బస్సు అమల్లోకి వచ్చినప్పటి నుంచి అనేక మంది పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
AP Pensions: నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!