DK Sivakumar: కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్.. రంగంలోకి దిగిన డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Sivakumar: కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయంలోనూ, అక్కడ రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడల్లా ఎక్కువగా వినిపించే పేరు డీకే శివకుమార్.. గెలిచే అభ్యర్థులను జంప్ చేయడం కంటే సంక్షోభ సమయాల్లో పార్టీ ఎమ్మెల్యేలను కలిసి ఉంచడంలో ఆయన నిపుణుడు. అందుకే రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ అంటారు. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలిచే డీకేఎస్… కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయం కాంగ్రెస్ కు మరిచిపోలేనిది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ ఆయన సేవలను వినియోగించుకుంటోంది.
Read also: Election Counting: రేపే నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..
Also Read
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీకేఎస్ను విశ్వసిస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయన యాక్టివ్గా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటక సంక్షేమాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఇక.. రేపు ఫలితాల సందర్భంగా ఆయన ఇక్కడే సెటిల్ కాబోతున్నారు. అక్కడక్కడ మ్యాజిక్ ఫిగర్ ఫలితాలు వస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలను వదలకుండా బాధ్యత ఆయన చేతుల్లోకి వెళ్లిపోయింది. తెలంగాణ ఫలితాలు వెలువడిన తర్వాత గెలుపొందిన వారిని బెంగళూరు తరలిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ఊహాగానాలను డీకేఎస్ స్వయంగా కొట్టిపారేశాడు. ఎమ్మెల్యేలను ఎక్కడికీ తరలించాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతుండగా.. దానికి ఒకరోజు ముందుగానే హైదరాబాద్ లో దిగారు.
Read also: Telangana Elections 2023: రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కు ఏర్పాట్లు.. సాయుధ బలగాలతో పహారా..
ఫలితాల రోజున తెలంగాణ కాంగ్రెస్ భారీ ప్లాన్ అమలు చేయనుంది. ఏఐసీసీ ఒక్కో నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమిస్తుంది. ఎగ్జామినర్ ఎమ్మెల్యే సర్టిఫికెట్తో నేరుగా అభ్యర్థిని హైదరాబాద్లోని తాజ్కృష్ణ హోటల్కు తీసుకువస్తారు. డీకేఎస్ సమక్షంలో వారు అక్కడే ఉంటారు. పూర్తి మెజారిటీ వచ్చినా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని డీకేఎస్ భావిస్తుంది. ఎమ్మెల్యేలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రలోభాలకు గురిచేయకుండా చూసుకునే బాధ్యతను ఇప్పుడు ఆయనే స్వయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సంపూర్ణ మెజారిటీ సాధిస్తాం. మేం క్యాంపు రాజకీయాలు చేయడం లేదు. మా ఎమ్మెల్యే అభ్యర్థులను కొందరు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మాకు సమాచారం ఉంది. కానీ, మా ప్రజలు పార్టీకి విధేయులు లొంగరు..’’ అంటూ డీకేఎస్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్. అయితే రంగంలోకి అయితే ట్రబుల్ షూటర్ అయితే దించారు కాంగ్రెస్ మరి రేపటి ఫలితాల్లో ఎవరు గెలిచేంది. ఎవరు ఓడేది అనేది తేలనుంది.
SpaceX: స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ విషెస్
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!