మీతో కలిసి మేం.. మాకో ఎమ్మెల్సీ ఇవ్వండి.. కేసీఆర్కు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.. అభ్యర్థుల వేటలో పడిపోయారు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్.. మరోవైపు ఎలాగైనా ఓ సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసే ఆశావహులు లేకపోలేదు.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సీఎం కేసీఆర్కు ఓ విజ్ఞప్తి చేసింది.. సీఎం కేసీఆర్కు లేఖ రాశారు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు.. ప్రైవేట్ పాఠశాలలో చదివే 55 శాతం విధ్యార్థుల కోరకు మరియు లక్షల మంది టీచర్ల భవిష్యత్ కోసం చట్ట సభలో ఉండేవిధంగా ఒక్కసారి ఆలోచించాలని ఓ లేఖ రాశారు..
Read Also: పెళ్లికి ఇలా కూడా పిలుస్తారా..? మీరు తప్పనిసరిగా తీసుకురండి..!
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
తెలంగాణ రాష్ట్రంలో 55 శాతానికి పైగా విద్యా సేవలందిస్తూ 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పది వేల ఐదు వందల ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ ద్వారా మీ కల అయిన బంగారు తెలంగాణ సాధన దిశగా మీతో కలిసి అడుగులేస్తూ, మీ ఆశయాలకు, ఆలోచనలకు తోడుగా ఉంటూ, కన్నతల్లి వంటి తెలంగాణ రాష్ట్ర రుణాన్ని తమ వంతు కర్తవ్యంగా తీర్చగలుగుతున్నందుకు తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల సంఘం (TRSMA) సభ్యులందరూ తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఉద్యమ కాలం నుండి మీ ఆలోచనలకు అనుగుణంగా నడుస్తూ, మీ మాటలే ఆదేశాలుగా అమలు చేస్తూ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్త వలే టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సమయాలలో, పార్టీ మీటింగ్ మరియు అధికారిక, అనధికారిక కార్యక్రమాల సమయంలో బస్సులు, జన సమీకరణ, ఇతర అవసరాలకు ట్రస్మా ముందున్నదని తెలియజేయుటకు సంతోషిస్తున్నామని.. పార్టీకి సేవలందిస్తున్న మమ్ములను, ప్రభుత్వానికి అండగా ఉంటున్న మా ( TRSMA)నిబద్ధతను గుర్తించి ఈ ఎమ్మెల్సీ కేటాయింపులలో విద్యా రంగానికి చెందిన మాకు ఒక అవకాశం కల్పించాలని కోరుతున్నామని.. ఈ ఒక్కసారి మాకు అవకాశం కల్పించినట్లైతే మా సేవలను అధికారికంగా అందించుటకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.. గతంలో స్పష్టమైన మెజారిటీతో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు గారు ఎమ్మెల్సీ స్థానానికి బరిలో ఉన్నప్పటికిని పార్టీ ఆదేశానుసారం రెండవ ఆలోచన లేకుండా చెప్పిన వెంటనే ఉపసంహరించుకోవడం జరిగింది. దయతో మమ్ములను గుర్తించి ఈసారి తప్పక మాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానం కల్పించాలని కోరుతున్నాం అంటూ ట్రస్మా సీఎం కేసీఆర్కు లేఖ రాసింది.
తాజావార్తలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..