Vice President Election: విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vice President Election: తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకుంది. విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్కు చెందిన ఎంపీలందరూ మార్గరెట్ అల్వాకు ఓటు వేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. మార్గరెట్ అల్వాకు 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఓటేయనున్నారు. పార్లమెంట్ భవనంలో రహస్య బ్యాలెట్ విధానంలో రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలు ఓటేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఆర్వోగా లోక్సభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు విడుదల చేశారు.
Reavnth Reddy: వెంకన్న మా వాడే.. రాజ్ గోపాల్ ద్రోహి..
Also Read
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉప రాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో కొంత అనుమానం తలెత్తింది. మమత బెనర్జీ తరహాలోనే ఎన్నికలకు దూరంగా ఉంటుందన్న ప్రచారమూ జరిగింది. అయితే చివరకు కాంగ్రెస్ అభ్యర్థి అయినా సరే ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.
Telangana Rashtra Samithi (TRS) announces support for opposition candidate Margaret Alva for the vice-Presidential election pic.twitter.com/KG8zGVtdZq
— ANI (@ANI) August 5, 2022
తాజావార్తలు
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!