MLA Methuku Anand:కార్పొరేట్ సంస్థల చేతుల్లో బీజేపీ స్టీరింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుక్కుగూడ బీజేపీ సభలో అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. దీనిపై ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్పందించారు. అమిత్ షా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల చేతుల్లో బీజేపీ స్టీరింగ్ ఉందని మండిపడ్డారు.
జనం గోస – బీజేపీ భరోసా అంటే జనాలను గోస పెడతామని కచ్చితమైన భరోసా బీజేపీ ఇచ్చిందని అన్నారు. ఎస్సి రిజర్వేషన్ల ఫైల్, ఎస్టీల ఫైల్, బీసీ జనగణన ఫైల్ కేంద్రం దగ్గరే పెట్టుకుందని మండి పడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
మన నీళ్లు మన దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యంగ బద్దంగా ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వడం లేదని, నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో కేంద్రం మాట తప్పుతోందని పేర్కొన్నారు. నరేగా నిధుల విషయంలో 18 వేల కోట్లు అని amit షా అంటే, 30 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని కిషన్ రెడ్డి చెబుతున్నారు.
ఎవరు చెప్పింది నిజమని నిలదీశారు. తెలంగాణలో తుగ్లక్ పాలన అంటున్నారు! నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? రైతులకు క్షమాపణ చెప్పింది ఎవరు? అని ప్రశ్నించారు. భారతదేశంలో తుగ్లక్ పాలన జరుగుతుందా లేదా అనేది ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
ఇక.. తుక్కుగూడ బీజేపీ సభలో అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడాడని.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 బిల్ విషయంలో టిఆర్ఎస్ పై చేసిన అమిత్ షా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. హోంమంత్రి స్థాయిలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు.
బీజేపీ ఎనిమిదేళ్ళలో తెలంగాణకు ఏం చేసింది ? టిఆర్ఎస్ ది కుటుంబ పాలన అంటున్న పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సిందియా, వసుంధర రాజే, బీవై విజయేంద్ర, వరుణ్ గాంధీ ఇంకా అనేక మంది బీజేపీలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాటం చేసిన కేటీఆర్ తెలంగాణ పాలనలో భాగస్వాములు కావొద్దంటా? ఎలాంటి పోరాటం చేయని బీజేపీ నేతలు రాజకీయాల్లో కొనసాగొచ్చా ? అని నిలదీశారు.
Akshay Kumar: మరోసారి కరోనా బారిన స్టార్ హీరో.. కేన్స్ ఫెస్టివల్కు దూరం
- Tags
- Amit Shah
- bjp
- kcr
- ktr
- MLA Methuku Anand
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!