అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రమంతా ఒకతీరు… ఖమ్మం జిల్లాలో ఒకతీరు మాదిరిగా వుంది. నేతలు వర్గాలుగా చీలిపోయి అస్థిత్వం కోసం పోరాటం చేస్తూ వుంటారు. తాజాగా పోటాపోటీగా చేసిన కార్ల ర్యాలీలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కందుకూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి వేరువేరుగా చేరుకుని విజేతలకు బహమతులను ప్రధానం చేశారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కందుకూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా రెండు వర్గాల వారు వేరువేరుగా కబడ్డీ,ఎడ్ల బల ప్రదర్శన క్రీడా పోటీలు నిర్వహించారు.
ఈ క్రమంలో సత్తుపల్లి నుండి భారీ కార్ల ర్యాలీతో కందుకూరుకు చేరుకుని కబడ్డీ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. అదేవిధంగా ఎడ్ల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒక వైపు ఎమ్మెల్యే సండ్ర వర్గం మరోవైపు పొంగులేటి వర్గం భారీ కార్ల ర్యాలీనీ పోటాపోటీగా నిర్వహించడం సత్తుపల్లిలో హాట్ టాపిక్ గా మారింది.