Khammam: పోడు భూముల వివాదం.. పోలీసులపై కర్రలతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam: పోడు భూముల వివాదంలో పోలీసులని ఉరికిచ్చి కొట్టిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు లోని చంద్రాయపాలెం గ్రామంలో పోడు భూముల వ్యవహారంలో అక్కడ ఉన్న రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గిరిజనుల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపేందుకు సత్తుపల్లి నుంచి పోలీసులు చేరుకున్నారు. సత్తుపల్లి సిఐ కిరణ్ ఆధ్వర్యంలో సమస్యని పరిష్కరించడం కోసం ఇరువర్గాలని సమన్వయ పరచడానికి ప్రయత్నం చేశారు. ఈ సమన్వయ పరిచే సందర్భంగా గిరిజనుల్లో ఒక వర్గం కర్రలు తీసుకొని పోలీసులపై దాడికి పాల్పడింది. అటవీ ప్రాంతంలోనే గిరిజనులు పెద్ద పెద్ద కర్రలతో సీఐతో పాటు వున్న పోలీసుల అక్కడి నుంచి ఉరికించారు. అంతేకాకుండా.. వారిపై దాడికి పాల్పడ్డారు.
Read also: Krishna Express: విరిగిన రైలుపట్టాలు.. ఆలేరు వద్ద కృష్ణ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
దీంతో కొంతమంది పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వారి వెంటపడి గిరిజనులు తరుముకుంటూ వెళ్లారు. పెద్ద పెద్ద కర్రలతో గిరిజనులు ఒక్కసారిగా పోలీసుల మీద పడటంతో పోలీసులు పరుగులు పెట్టారు. గిరజనులకు ఎంత చెప్పినా వినకపోవడంతో.. ఇక పోలీసులు కూడా చేతులెత్తేసారు.. అక్కడి నుంచి పరుగులు పెడుతూ వచ్చారు. వారి మోటార్ బైక్ పై ఎక్కి వెళ్ళిపోతున్న పోలీసులు సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులపై కూడా వెంట తరిమి వారిపై కూడా దాడి చేశారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో పోలీసులు మోటార్ బైక్ నుంచి దిగి వారిని గిరిజనులని బ్రతిమిలాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు గిరిజన వర్గాల మధ్య ఉన్న విభేదాన్ని పరిష్కరించడానికి వెళ్లిన పోలీసులుకి గిరిజనుల దాడిలో తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అసలు పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం ఎందుకు తలెత్తింది అనేదానిపై ఆరా తీస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకునే లోపే ఇరువర్గాలు ఇలా దాడి చేయడంపై దర్యాప్తు సిద్దమయ్యారు పోలీసులు.
Nama Nageswara Rao: ఒక్కసారి పాలేరు రిజర్వాయర్ కి నీళ్లు వదలండి..!
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.