Vikarabad Accident: వికారాబాద్ ఘటన.. మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad Accident: వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటో-లారీ ఢీకొన్ని ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ స్పందించారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మృతుల కుటుంబాలతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల కు సరైన రోడ్లు లేకపోవడం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో పేద ప్రజలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేసి ఉండడంతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవన్ నాయక్, ఎస్ సి మోర్చా జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, వికారాబాద్ పట్టణ ఇంచార్జి శివప్రసాద్, మాజీ కౌన్సిలర్ సురేష్, రమేష్ పాల్గొన్నారు.
Read also: Australia: ఇండియన్ వ్యక్తిపై రూ.5 కోట్ల రివార్డ్ ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఎందుకో తెలుసా..?
Also Read
- Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
- Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ఇవాళ ఉదయం కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటో-లారీ ఢీకొన్ని ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక, మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. బాధితులు అంతా పెద్దేముల్ మండలం మదనంతాపూర్ వాసులుగా పోలీసులు తెలిపారు. రోజూ కూలీ పనుల కోసం వికారాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే.. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Kantara : ‘కాంతార’ చూసిన కేంద్రమంత్రి.. రిప్లై ఏమిచ్చారంటే..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!