Ghatkesar Crime: పుట్టిన రోజు వేడుకలో విషాదం.. సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి..!
- ఘట్ కేసర్ పరిధిలో విల్లా లో పుట్టిన రోజు వేడుకలో విషాదం..
- ఈత రాదని చెబుతున్నప్పటికీ స్విమ్మింగ్ పూల్ లో వేసి వెళ్లిపోయిన ఫ్రెండ్స్..
- 45 నిమిషాల పాటు ఈతకులంలో కొట్టుమిట్టాడి చనిపోయిన అజయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghatkesar Crime: పుట్టిన రోజు వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. ఈత కొలనులో సాప్ట్ వేర్ ఎంప్లాయ్ మృతి చెందిన ఘటన ఘట్ కేసర్ లో కలకలం రేపుతుంది.
మాదాపూర్ లో ఓ ఐటీ సంస్థలో మేనేజర్ గా పని చేసే శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఘట్ కేసర్ పరిధిలోని PARV విల్లాలో విందు, వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు 20 మంది ఉద్యోగులు హాజరయ్యారు. అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. మద్యం సేవించి ఆట, పాటలు పాడుతూ సంతోషంగా గడిపారు. అయితే ఇంతలోనే ఓ విషాదం నెలకొంది. పుట్టినరోజు వేడుకల్లో తోటి ఉద్యోగులే అజయ్ అనే వ్యక్తిని హత్య చేశారు. వీరందరూ పార్టీ నిర్వహిస్తున్న విల్లాలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అక్కడ అందరూ మద్యం సేవిస్తూ.. అజయ్ తో మాట మాట కలుపుతూ స్విమ్మింగ్ పూల్ లో తోసేశారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
Read also: Telangana project: ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాలు.. ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం..
అయితే అజయ్ అక్కడున్న వారితో తనకు స్విమ్మింగ్ రాదని చెబుతున్నా వినలేదు. మద్యం మత్తులో వున్న తోటి ఉద్యోగలందరూ అజయ్ ను స్విమ్మింగ్ పూల్ లో వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అజయ్ 45 నిమిషాల పాటు ఈత కులనులో కొట్టుమిట్టాడి బయటకు రాలేక చివరకు ప్రాణాలు వదిలాడు. అయితే ఇంత జరుగుతున్న మేనేజర్ శ్రీకాంత్ కూడా అక్కడే వున్న అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అజయ్ కు ఈత రాదని చెబుతున్న తన మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి మేనేజర్ తో సహా తోటి ఉద్యోగులు వెళ్లిపోయారు. స్విమ్మింగ్ పూల్ లోతుగా ఉండటం, అజయ్ కు ఈత రాకపోవడంతో అందులోనే ప్రాణాలు వదిలాడు. తరువాతి రోజు అజయ్ మృతి వార్త విన్న మేనేజర్, తోటి ఉద్యోగులు షాక్ తిన్నారు. మృతుడు అజయ్ మేన మామా కిషోర్ ఇచిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఘాట్ కేసర్ పోలిసులు. PARV ఫామ్ హౌస్ యజమాని రంజిత్ రెడ్డి, స్నేహితులు సాయి కుమార్, నిఖిల్, ఐటి సంస్థ మేనేజర్ శ్రీకాంత్ నలుగురిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ తరలించారు.
Medak Temple: మూడో రోజు జలదిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ ఆలయం
తాజావార్తలు
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!