Traffic Diversions: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి.. 26 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Diversions: తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 26 నుంచి 30 వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బొల్లారం, సోమాజిగూడతో పాటు నగరంలోని పలు ప్రాంతాల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. హకీంపేట్, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలి, ప్లాజా, బేగంపేట, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ మధ్య సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
Read also: Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేసు.. సీన్ రీ కన్స్ట్రక్షన్
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
* శామీర్ పేట నుంచి ఓఆర్ ఆర్ మీదుగా మేడ్చల్ కు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు. కొంపల్లి, సుచిత్ర, బోయిన్పల్లి, తాడ్బండ్, లీ రాయల్ ప్యాలెస్ మధ్య లేదా శామీర్ పేట నుంచి కీసర, ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా బిట్స్, హైదరాబాద్ వెళ్లాలని సూచించారు.
* కరీంనగర్ మార్గంలో వచ్చే ప్రయాణికులు జేబీఎస్-అల్వాల్ మార్గంలో వెళ్లవద్దని, ప్రత్యామ్నాయంగా ఓఆర్ఆర్-మేడ్చల్ లేదా ఘట్కేసర్ నుంచి కొంపల్లి, ఉప్పల్ వెళ్లాలని సూచించారు.
* మంగళవారం హకీంపేట్, సికింద్రాబాద్ క్లబ్, టివోలి, ప్లాజా, సిటిఓ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బలా, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణగూడ క్రాస్ రోడ్డు ప్రాంతాల మధ్య ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ సమయంలో ట్యాంక్బండ్ సాధారణ ట్రాఫిక్కు మూసివేయబడుతుందని పోలీసులు తెలిపారు.
* రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఈ నెల 30 వరకు నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. శీతాకాల విరామ సమయంలో ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులను మోహరిస్తారు.
ద్రౌపది ముర్ము తొలిసారిగా తెలంగాణకు వస్తున్నందున అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 4.15 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మైమానిక దళం శిక్షణా కేంద్రంలో సీఎం, గవర్నర్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. తొలిసారిగా తెలంగాణకు వస్తున్న ద్రౌపది ముర్మును ఘన స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Mangaluru: ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు.. మంగళూరులో 144 సెక్షన్
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!