Independence Day Celebrations: నేడు సామూహిక గీతాలాపన.. అబిడ్స్ జీపీఓ వద్ద పాల్గొననున్న సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు స్వాత్రంత్ర్య భారత వజ్రోత్సవాల్లో కీలక ఘట్టం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రమంతా ఒకే సమయంలో జాతీయగీతం పాడేలా ఏర్పాట్లు. అబిడ్స్ పోస్టాఫీస్ దగ్గర సామూహిక జాతీయగీతాలాపనలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు కార్యక్రమం కొనసాగనుంది. అన్ని ట్రాఫిక్ కూడళ్లో నిమిషం పాటు రెడ్ సిగ్నల్ వేసి ఈ సామూహిక జాతీయగీతాలాపన వుంటుందని పేర్కొన్నారు. సామూహిక జాతీయగీతాలాపన నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.
నగరంలోని లిబర్టీ, బషీర్బాగ్ నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను బీజేఆర్ సర్కిల్ వద్ద ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి స్టేషన్ రోడ్డుకు మళ్లిలించనున్నారు. లిబర్టీ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను బీజేఆర్ సర్కిల్ వైపు అనుమతించే అవకాశంలేదు. లిబర్టీ వద్ద హిమాయత్నగర్, నారాయణగూడ, కాచిగూడ, కోఠి రూట్లలోకి మళ్లిస్తారు. కింగ్కోఠి నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను హనుమాన్ టేక్డి, ట్రూప్ బజార్, కోఠి వైపు మళ్లించనున్నారు. బొగ్గులకుంట నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను బొగ్గులకుంట క్రాస్ రోడ్డు వద్ద హనుమాన్ టేక్డి, ట్రూప్ బజార్, కోఠి వైపు మళ్లిస్తారు. ఎంజే మార్కెట్, జాంబాగ్ నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను ఎంజేమార్కెట్ నుంచి నాంపల్లి వైపు మళ్లించనున్నారు. పీసీఆర్ నుంచి బీజేఆర్ సర్కిల్ మీదుగా అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను, ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డులోకి మళ్లిస్తారు.
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
సోమాజిగూడ, ఖైరతాబాద్, రవీంద్ర భారతి జంక్షన్, అసెంబ్లీ, ఎల్బీస్టేడియం, బీజేఆర్ విగ్రహం, లిబర్టీ, హిమాయత్నగర్, జీపీఓ అబిడ్స్, ఎంజేమార్కెట్, నాంపల్లి రోడ్లలో భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలి. కాగా..జీపీఓ వద్ద జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చే వారు తమ వాహనాలను నిజాం కాలేజీ గ్రౌండ్, తాజ్మహల్ నుంచి కింగ్ కోఠి ఎక్స్ రోడ్డు, బాటా నుంచి బొగ్గుల కుంట ఎక్స్ రోడ్డు, జీహెచ్ఎంసీ అఫీస్, రామకృష్ణ థియేటర్, జార్జ్ గ్రామర్ స్కూల్ ప్రాంగణాల్లో పార్కింగ్ చేయాలి. ఎంజే మార్కెట్, ఆఫ్జల్గంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, అన్నపూర్ణ హోటల్ రోడ్డులో పార్కు చేయాలి.
Bihar Cabinet: నేడే బిహార్ మంత్రివర్గ విస్తరణ.. సింహభాగం ఆర్జేడీకే..!
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!