Traffic Police: సిగ్నల్ క్రాస్ చేస్తున్నారా? అయితే జాగ్రత.. 24గంటలు నిఘా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Police: నగరవాసులు ఇక అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే.. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, స్పీడ్ గా బైక్, కారు, ఇతర వాహనాలు నడపడం వంటివి ఇకపై చెల్లవు అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక పగలు రాత్రి అనే తేడాలేకుండా సీసీ కెమెరాలే కాదు ఇకపై ట్రాఫిక్ పోలీసులు నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఇకపై 24 గంటలు ట్రాఫిక్ పోలీసులు మీపై నిఘా ఉంటుంది. షిప్ట్ ల వారీగా మనపై నిఘా ఉండేందుకు పోలీసులు రాత్రికూడా డ్యూటీ చేయనున్నారు. ఈనేపథ్యంలో.. రాత్రి వేళలోనూ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. భాగ్యనగరంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం ట్రాఫిక్ రద్దీ లేని అర్థరాత్రి, ఉదయం సమయాల్లోనే నమోదవుతున్నాయి. దీంతో ఈ దూకుడుకు కళ్లెం వేసేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు కొత్త పద్ధతి అనుసరించనున్నారు. ఈనేపథ్యంలో.. ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగించి అక్కడి ఫలితాలను విశ్లేషిస్తారు. ఈసందర్బంగా.. దీనిపై నగర ట్రాఫిక్ అదనపు సీపీ జి.సుధీర్ బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈనేపథ్యంలో.. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ పరిస్థితులు అదనపు సీపీ సుధీర్ బాబు పరిశీలించారు.
ముఖ్యంగా.. 35 కూడళ్లలో నిఘా..
Also Read
- Honour Killing: గోల్కొండలో ఘోరం.. యూట్యూబర్ను వెంటాడి చంపిన వైనం..!
- TPCC Mahesh Goud: పవన్ కళ్యాణ్పై మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
- Shadi Mubarak Scam: 'షాదీ ముబారక్' పేరుతో భారీ దోపిడి.. రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా.!
అయితే.. ఇప్పటివరకూ ట్రాఫిక్ పోలీసులు ఉదయం 8. నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే విధుల్లో ఉంటున్నారు. ఇకపై నగరంలోని 35 ప్రధాన కూడ ళ్లలో రాత్రి 8-12 గంటలు, ఉదయం 6-8 గంటల వరకూ విధులు నిర్వర్తించనున్నారు. రాత్రి 8-12 గంటల వరకు వీధుల్లో ఉన్న సిబ్బంది అర్ధరాత్రి 12. తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్లో విశ్రాంతి తీసుకుంటారు. తరువాత తిరిగి ఉదయం 6-8 గంటల వరకూ అదే కూడలిలో విధులు చేపడతారు. అనంతరం రోజు వారీ విధులకు వచ్చే సిబ్బంది రాగానే వీరంతా ఇళ్లకు చేరతారు. ఇక.. మొదటగా ఈ విధానాన్ని పంజా గుట్ట, సోమాజిగూడ, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, కేబీఆర్ పార్క్, ఏఎన్ఆర్ఎ సర్కిల్, బేగంపేట తదితర ప్రధాన కూడళ్లలో అమలు చేయనున్నట్టు నగర ట్రాఫిక్ అదనపు సీపీ జి. సుధీర్ బాబు తెలిపారు. అయితే.. మరోవైపు రద్దీలేని సమయాల్లోనూ నిబంధనలు పాటించని వాహనాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చాలానాలు పంపనున్నారు. వాహనదారులు ఇప్పుడు అలర్ట్ గా ఉండాలని, స్పీడ్ గా వాహనాలు నడపరాదని సూచించారు అధికారులు. సో వాహనదారులు బీ అలర్ట్.
Food Poisoning: పాలేరు నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత
తాజావార్తలు
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
Yemen: యెమెన్ ‘స్పైడర్ మ్యాన్’ ఓవరాక్షన్.. ఎంత పని చేశాడంటే..!
-
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
Chiranjeevi – Charan: ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్
-
Isakapatnam Trailer: పవర్ ప్యాక్డ్ ఇసకపట్నం ట్రైలర్ చూశారా?
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!