Traffic diversion: నగరంలో ట్రాఫిక్ డైవర్సన్.. గంట ముందే బయలు దేరండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic diversion: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. దీంతో సికింద్రాబాద్ పరిధిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. చాలా రోడ్లు పూర్తిగా మూసివేయబడతాయి. మరికొన్ని చోట్ల వాహనాలను దారి మళ్లిస్తారు.
ఇటు వెల్లండి..
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
మోనప్ప జంక్షన్, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్నగర్, రసూల్పురా CTO, ఫ్లాజా, SBH, YMCA, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, అలుగడబావి, చిలకలగూడ జంక్షన్, MJ రోడ్, RP రోడ్, SP రోడ్డు చాలా రద్దీగా ఉన్నాయి. జంక్షన్ల వైపు వెళ్లవద్దని సూచించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లే వారు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే స్టేషన్కు చేరుకోవాలని పోలీసులు తెలిపారు. ఉప్పల్-సికింద్రాబాద్ మార్గంలో కూడా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
1. టివోలి ఎక్స్ రోడ్స్ నుండి ఫ్లాజా ఎక్స్ రోడ్ వరకు ఇరువైపులా మూసివేయబడతాయి.
2. ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్స్ నుంచి స్వీకర్.. ఉపకార్ జంక్షన్ వరకు ఇరువైపులా రహదారిని మూసివేస్తారు.
3. చిలకలగూడ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, రెటిఫైల్ టి జంక్షన్ నుంచి వచ్చే ప్యాసింజర్ వాహనాలను అనుమతించరు. ప్రయాణికులు క్లాక్ టవర్ పాస్పోర్ట్ ఆఫీస్, రెజిమెంటల్ బజార్ మార్గంలో సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ గేట్కు చేరుకోవాలి.
4. కరీంనగర్ వైపు నుంచి రాజీవ్ రహదారి మీదుగా నగరానికి వచ్చే వారు ఓఆర్ ఆర్ మీదుగా దిగి కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.
5. కీసర ఓఆర్ఆర్ గేటు నుంచి ఈసీఐఎల్, మౌలాలి, నాచారం, ఉప్పల్ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.
6. తిరుమలగిరి క్రాస్ రోడ్డు నుంచి ఎడమవైపునకు వెళ్లి ఏఎస్రావునగర్, ఈసీఐఎల్, మౌలాలి, తార్నాక నుంచి నగరంలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాలి.
7. కరీంనగర్ వైపు వెళ్లే వారు తిరుమలగిరి క్రాస్రోడ్, జేబీఎస్ మార్గాల్లో కాకుండా ఓఆర్ఆర్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
గంట ముందే బయలు దేరండి..
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. దీంతో పదో తరగతి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్లో చిక్కుకుపోతే పరీక్షకు ఆలస్యంగా వచ్చే ప్రమాదం ఉందని, విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా ఎస్ఎస్సీ, ఏఎస్సీ పరీక్షలు ఉన్నందున అభ్యర్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు.
Harry Brook: టెస్టులాడే వ్యక్తికి కోట్లు కుమ్మరించారు..
తాజావార్తలు
-
Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
-
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
-
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..