TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
- కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. కాంగ్రెస్ హర్షం
- తెలంగాణ మోడల్ పాలన ప్రభావం: మహేష్ గౌడ్
- కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
- విజయ్కు అభినందనలు.. ఇండియా కూటమి సమీక్ష త్వరలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) భారీ విజయం సాధించడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం కేరళ రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక ఘట్టమని ఆయన కొనియాడారు. కేరళలో కాంగ్రెస్ కూటమి గెలుపు వెనుక తెలంగాణ కాంగ్రెస్ నేతల కృషి ఎంతో ఉందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, కీలక నేతలు కేరళలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న ప్రజా పాలనను చూసి ఓట్లు వేయాలని తాము కోరామని, ఆ ప్రభావం కేరళ ఓటర్లపై స్పష్టంగా కనిపించిందని ఆయన విశ్లేషించారు.
కేరళలో వచ్చిన ఈ ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త నమ్మకాన్ని నింపాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విజయం తమ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చిందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న ధీమా పెరిగిందని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకోవడం పార్టీ భవిష్యత్తుకు శుభసూచకమని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
ఇదే క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించిన టీవీకే (TVK) అధినేత విజయ్కు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ‘ఇండియా’ (INDIA) కూటమి త్వరలోనే సమీక్ష నిర్వహించబోతోందని ఆయన చెప్పారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని, కూటమిని దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
-
Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
-
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
-
Indian Student: ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి.. ఉజ్బెకిస్తాన్లో భారతీయ విద్యార్థిని హత్య..?
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!