Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్రమంత్రి.. రాత్రికి హైదరాబాద్లోనే బస..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నగరంలో రోడ్ షో నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్ రానున్నారు. రాత్రి 7:30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో లాల్ దర్వాజ చేరుకోనున్నారు. లాల్దర్వాజ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు రాత్రి 8.15 గంటల నుంచి 9.15 గంటల వరకు గంటపాటు ఈ రోడ్షో సాగనుంది. రోడ్ షో అనంతరం అమిత్ షా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు చేవెళ్ల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
Read also: Guess the Actress: ఈ ఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది!
Also Read
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితి, ప్రచార సరళిపై ఆరా తీస్తారు. నేతల నుంచి అందుతున్న సమాచారం మేరకు పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి మోడీ పదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాహసోపేత నిర్ణయాలు, తెలంగాణకు చేసిన సాయం, భారతీయ జనతా పార్టీ ఆవశ్యకతను వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయాలన్నారు. సభ అనంతరం రాష్ట్ర కార్యాలయం నుంచి బేగంపేట ఐటీసీ కాకతీయకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
Read also: Amit Shah: అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. 8 రాష్ట్రాల్లో 16 మందికి నోటీసులు
అమిత్ షా పూర్తి షెడ్యూల్
* అమిత్ షా రాత్రి 7.40 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు
* బేగంపేట నుంచి కేంద్ర హోంమంత్రి లాల్ దర్వాజకు వెళ్లనున్నారు
* హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు
* రాత్రి 8 నుంచి 9 వరకు అమిత్ షా రోడ్ షోలో పాల్గొంటారు
* రోడ్ షో అనంతరం బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు
* సమావేశం అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో బస చేస్తారు
Parusuram :ఫ్యామిలీ స్టార్ తరువాత ఊహించని హీరోను పట్టిన పరశురాం..
తాజావార్తలు
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!