IT Officials Questioning Second Day On Malla Reddy Assets: మంత్రి మల్లారెడ్డి పై సోదాల కేసులో ఐటీశాఖ విచారణ ముమ్మరం కొనసాగతుంది. రెండో రోజు ఆదాయపన్ను శాఖ అధికారులు చేపట్టిన విచారణ ముగిసింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇవాళ మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐటీ అధికారులు ఇద్దరికీ నమూనా ప్రతాలు ఇచ్చారు. నిర్దేశించిన సమాచారాన్ని సమర్పించాలని ఆదాయపు పన్నుశాఖ అధికారులు సూచించారు.
నిన్న ఐటీ అధికారుల ఎదుట 9 మంది హాజరుకాగా.. మల్లారెడ్డి ఆడిటర్ సీతారామయ్య సహా కళాశాలకు చెందిన సిబ్బందిని అధికారులు విచారించారు.మల్లారెడ్డి విద్యాసంస్థల అకౌంటెంట్లను ఐటీ అధికారులు ప్రశ్నించారు. సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న దస్త్రాలు, నగదు, హార్డ్ డిస్క్ లకు సంబంధించిన విషయాలపై ఈరోజు హాజరైన వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా.. విద్యా సంస్థలకు చెందిన ఆదాయ వ్యయాలతో పాటు పన్ను చెల్లింపునకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. వీళ్లను ప్రశ్నించి సమాచారం సేకరించిన ఐటీ దీని ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
Read also: IND Vs NZ: మూడో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా గెలిచి సమం చేసేనా?
అయితే మొదటి రోజు మల్లారెడ్డి కుటుంబ సభ్యులతోపాటు ఆయన విద్యాసంస్థల సిబ్బందిని అధికారులు విచారించారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డిని ప్రశ్నించిన విషయం తెలిసింది. లక్ష్మారెడ్డి వెంటనే వెళ్లిపోగా మిగిలిన వారిని 6 గంటలపాటు విచారించారు ఐటీ అధికారలు. వీరితో పాటు మల్లారెడ్డి బంధువైన నర్సింహారెడ్డి,అతని కుమారుడు త్రిశూల్ రెడ్డిలను సైతం ప్రశ్నించారు. ఈ విచారణపై మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానాలు చెప్పామని, ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారని అన్నారు. అవసరమైతే తాము మరోసారి కూడా విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించారన్నారు. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై విచారణ చేశారని, తాము చెప్పిన సమాధానాలతో వాళ్లు సంతృప్తి చెంది ఉంటారని చెప్పారు.
IT Enquiry: నేడు ఐటీ ముందుకు మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు
