తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 325 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 424 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,119 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,47,185 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,869 కు చేరుకుంది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 78,787 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు బులెటిన్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.