Bathukamma festival : బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనక దాగున్న రహస్యం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathukamma festival: ప్రకృతిని దేవతగా భావించి ఆరాధించే సాంప్రదాయం కేవలం తెలంగాణాలో మాత్రమే కనిపిస్తుంది. విజయ దశమికి 10 రోజుల ముందు నుండి తెలంగాణా ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ వర్షాకాలంలో వస్తుంది. పరుచుకున్న పచ్చదనంలో, హాయిగొలిపే పువ్వుల నవ్వుల్లో, జారే జలపాతపు సడిలో, పారే సెలయేటి హొయల్లో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందమైన ప్రకృతిని చూసిన వాళ్ళ మనసు పరవశిస్తుంది. అలాంటి ఈ సమయంలో దొరికే రకరకాల పువ్వుల్ని ఓ చోట పేర్చి మహిలు అందరూ ఓ చోట చేరి పాటలు పాడి నీటిలో నిమర్జనం చేస్తారు. ఆలా మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాడే పాటలు వినడానికి వినసొంపుగా.. చూడడానికి కనుల విందుగా ఉంటుంది. అయితే ఈ పండుగ జరుపుకోవడం వెనుక ఓ కథ ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని పూర్వం తైలపాడు అనే రాజు పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు చాళుక్య రాజ్యాన్ని పరిపాలించిన రాజరాజ చోళా కుమారుడు రాజేంద్రచోళ సత్యాస్రాయపై యుద్ధం చేసి విజయం సాధించాడు.
Read also:Mouse Milk : వామ్మో..! ఎలుక పాలు 18 లక్షలా..!
Also Read
- Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
- Bandla Ganesh: 'పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే'.. నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ ఆర్థిక చేయూత
- Hyderabad: చిన్న పొరపాటు.. నిండు ప్రాణం బలి! పాము కాటుకు గురై వ్యాపారవేత్త మృతి..
- Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..
అతను సాధించిన యుద్దానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. దీనికి కారణం తెలంగాణా ప్రజలు రాజేశ్వరి ఆలయంలోని అమ్మవారిని ఘాడంగా విశ్వసించేవారు. అయితే రాజేంద్రచోళ తండ్రి అయినటు వంటి రాజరాజ చోళా కూడా అమ్మవారి భక్తుడిగా మారాడు. ఈ కారణం చేత యుద్ధం లో విజయం సాధించిన రాజేంద్రచోళ ఆలయాన్ని కూల్చేసి అందులోని శివలింగాన్ని తన తండ్రికి బహూకరించాడు. ఈ విషయం తమిళ శిలాశాసనాల్లో లిఖించబడింది. అయితే వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తీసుకుపోవడంతో తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. దీనితో వాళ్లకు కలిగిన వర్ణనాతీత వేదనను చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా బతుకమ్మ పండుగ మొదలయింది. ఇప్పటికి తెలంగాణా ప్రజలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. పెళ్ళైన మహిళలు ఈ పండుగకు పుట్టింటికి వచ్చి బతుకమ్మను పేర్చి 9 రోజులు ఈ పండుగను జరుపుకుంటారు.
తాజావార్తలు
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
-
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
-
Viral News: రబ్బర్ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!