మేడారం సమ్మక్క, సారక్క జాతరకు ఆర్టీసీ సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జన సంద్రంతో హోరు ఎత్తే జాతర.. మేడారం సమ్మక్క, సారక్క జాతర ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఈ జాతరకు పేరుంది. జాతరకు ఇంకా సమయం ఉన్న అప్పుడే భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులను నడపడానికి సిద్ధమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే జాతర కోసం టీఎస్ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల సౌకర్యార్థం హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం వరకు ప్రత్యేక సర్వీసులను ఇప్పటికే నడపనుంది. ఉదయం 7గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరుతాయి. సాయంత్రం 4గంటలకు మేడారం నుంచి హన్మకొండకు వస్తాయి. హన్మకొండ నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.125, పిల్లలకు రూ.65 ఛార్జీలుగా టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. గత జాతర కోసం 3,532 బస్సులను ఆర్టీసీ వినియోగించింది. ఈసారి 3,835 బస్సు సర్వీసులను నడపనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 51 బస్సు పాయింట్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క, సారక్క దగ్గరికి, తిరిగి గమ్యస్థానాలకు చేర్చనున్నారు. ఇందుకోసం 12,267 మంది సిబ్బంది సేవలను ఆర్టీసీ వినియోగించుకోనుంది.
Read Also: మోడీ పాలనలో సంక్షేమం లేదు..అభివృద్ధి జరగదు: జగదీష్ రెడ్డి
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
హైదరాబాద్ నుంచి మేడారం వరకు ఆర్టీసీ ఏసీ బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేస్తుంది. అయితే అడ్వాన్స్ బుకింగ్ విషయమై ఇంకా స్పష్టత లేదు. హైదరాబాద్ టూ మేడారానికి మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ ఉండే అవకాశం ఉంది. తిరుగు ప్రయాణంలో అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉండకపోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని సిరోంచ నుంచి కాళేశ్వరం మీదుగా మేడారం వరకు అంతర్రాష్ట్ర సర్వీసులను సైతం ఆర్టీసీ నడపనున్నది. అలాగే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల మీదుగా బస్సు సర్వీసులు నడుపనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సామూహికంగా మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనున్నట్లు హన్మకొండ డిపో మేనేజర్ వి.మోహన్ రావు తెలిపారు. 30 మంది బృందంగా జాతరకు వెళ్లాలనుకునే వారు సెల్:9949857692లో ముందుగా తెలియజేస్తే.. ప్రత్యేక బస్సులు మీరు ఉన్నచోటుకే వచ్చి ఎక్కించుకుంటారని ఆయన తెలిపారు.
కరోనాను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ సిబ్బందికి 100శాతం వ్యాక్సినేషన్ను పూర్తిచేశారు. డిపో నుంచి బయల్దేరే ముందు బస్సులను శానిటైజ్ చేయనున్నారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడంతోపాటు మాస్క్ ధరించి ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రయాణికులు సైతం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి సూచిస్తుంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!