టీఆర్ఎస్ తీరు వల్లే రైతులకు కష్టాలు.. వస్తున్నాయని కానీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనదని ఎక్కడ చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ… హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో టీర్ఎస్ బెంబెలేత్తి పోతుంది.ఈ సీజన్లో చివరి బస్తాను కేంద్రం కొంటుందని చెప్పారు. టీర్ఎస్ లేని సమస్యలు సృష్టిస్తుంది. ధాన్యం సేకరణ అసలు సమస్యే లేదు. ఉప్పుడు బియ్యం తీసుకోమని చాలా ఏళ్ళ కిందే కేంద్రం స్పష్టం చేసింది. రా రైస్ వచ్చే విధంగా రైస్ మిల్లర్ల తో మాట్లాడారా ? రైతులకు ఆ రకమైన విత్తనాలు ఇచ్చారా ? మేము బియ్యం కొనమని ఎక్కడా లేఖ ఇవ్వలేదు. “పుత్ర వాత్సల్యం” తో రైతులను కేసీఆర్ బలి చేస్తున్నారు. హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన ఫలితం తో తన కొడుకు కేటీఆర్ సీఎం అవ్వలేడని కేసీఆర్ భయపడుతున్నారు. తెలంగాణ ను “విత్తన భాండాగారం” గా చేస్తామన్న కేసీఆర్ కనీసం ప్రత్యామ్నాయ విత్తనాలు కూడా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు స్వయంగా నకిలీ విత్తనాలు మార్కెట్ చేస్తున్నారు. ప్రభుత్వం సాయం లేక కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
తెలంగాణలో పంటల ప్రణాళిక లేదు. ఓ సారి మక్క వద్దంటారు…ఇంకోసారి సన్న బియ్యం వేసుకోమంటారు…ప్రభుత్వానికి ప్లానింగ్ లేదు. అందుకే బియ్యంకు ధాన్యం సేకరణ కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారు. బీజేపీని ప్రజలలో బద్నాం చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. కేంద్రం ఇచ్చిన టార్గెట్ ను తెలంగాణ రాష్ట్రం ఇంకా పూర్తి చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని టీఆర్ఎస్ నేతలు రీసైక్లింగ్ చేస్తన్నారు. రైతుల పేరు మీద ఎఫ్సీఐకి అమ్ముతున్నారన్నారు. మీ కుటుంబ పాలన వైఫల్యాన్ని కేంద్రం పై రుద్దాలని చూస్తున్నారన్నారు. మా విధానంలో ఎలాంటి మార్పు లేదు. మేం కొనబోమని ఎక్కడ చెప్పలేదు.
మీరు తప్పు చేసి కేంద్రం మీద నెడుతారా మీలాగా గజ్వేల్కు ఒక పాలసీ, దుబ్బాకకు ఒక పాలసీ మేం అమలు చేయడం లేదు. దేశమంతటా ఒకే విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి రైతులను ఒప్పించకుండా కేంద్రం పై నెపం వేస్తే ఎలా అని ప్రశ్నించారు. రైతులకు మేలు చేయాల్సింది పోయి కేంద్రం పై ద్వేషపూరిత భావం కలిగేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
