IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్.. ఈనెల 22న విచారణకు రావల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గత మూడు రోజుల క్రితం మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి నివాసాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్ లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ శాఖ ఏకకాలంలో సోదాలు చేయడంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. వ్యాపారాలు నిర్వహిస్తున్న నేతలే టార్గెట్ గా సోదాలు చేసినట్లు తెలుస్తోంది. సోదాల్లో బీఆర్ఎస్ నేతల నివాసాలు, వ్యాపారాల నుంచి అధికారులు పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ తన నివాసంలో పార్టీ కార్యకర్తలతో యదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడి కంచర్ల రామా కృష్ణ రెడ్డితో పైళ్ల శేఖర్ రెడ్డి సమావేశమయ్యారు.
అనంతరం పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ నా నివాసంలో గంటన్నర పాటు సోదాలు జరిగాయని తెలిపారు. కావాలనే ముడు రోజుల పాటు ఐ.టి అధికారులు కాలయాపన చేశారని మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది ఐ.టి అధికారుల తీరు ఉందని అన్నారు. ఇంకా ఏమన్నా దొరుకుతుందా అన్న దానిపై సోదాలు జరిగాయని తెలిపారు. నా నివాసంలో ఏం కనిపించలేదని అన్నారు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, నా సతీమణి బెంగుళూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని స్పష్టం చేశారు. దానికి సంబందించిన డాక్యుమెట్స్ తీసుకున్నారుని తెలిపారు. ఆదాయ పన్ను చెలిస్తున్ననని స్పష్టం చేశారు. కావాలనే నా పై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఐ.టి సోదాలు వెనుక ఏ పార్టీ హస్త ఉందో అందరికి తెలుసని మండిపడ్డారు. నాకు ఈనెల 22న గురువారం రమ్మని ఐ.టి అధికారులు నోటీసులు అందజేసారని తెలిపారు. నేను నిజాయితీగా ఉన్నారని, నా నియేజకవర్గం ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
ఐ.టి సోదాలు తరువాత నాకు అధిష్ఠానం నుండి అధ్యక్షుల నుండి పార్టీ నుండి ఎలాంటి కాల్స్ రాలేదని అన్నారు. గత మూడు రోజులుగా నాపై కుట్ర పూరితంగానే IT రైడ్స్ జరిగాయని అన్నారు. నాపై జరుగుతున్న పలు ఆరోపణలు నిజం కాదని తెలిపారు. IT రైడ్స్ మొదటి రోజే ఒక గంటన్నర లోనే పూర్తి అయ్యాయని, కావాలనే 3 రోజులు కాలయాపన చేశారని మండిపడ్డారు. విదేశాలలో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి అన్నది అవాస్తవం మని తెలిపారు. 1998 నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని అన్నారు. నాకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవని, IT అధికారులకు వారికి అనుకూలమైన సమాచారం రాకపోవడంతో నిరుత్సాహంతో వెనుతిరిగారని అన్నారు. నాకోసం మూడు రోజులుగా ఇక్కడే వున్న కార్యకర్తలకు, నాయకులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.
One Rupee Biryani: రూపాయి బిర్యానీ కోసం పోతే.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
తాజావార్తలు
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..