Tragedy: అంత కష్టం ఏమొచ్చిందో.. ఇద్దరు కూతుర్లను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS RTC: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బోయిన్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. 8 ఏళ్ల స్రవంతి, 7 ఏళ్ల శ్రావ్యలను హత్య చేసి తండ్రి శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని మాత్రలు ఇచ్చి కూతుళ్లను హత్య చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహిటిన అక్కడకు చేరుకున్న పోలీసులు శ్రీకాంత్ ను, పిల్లలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ తండ్రికి ఎంత కష్టమొచ్చిందో ఏమో కన్న పిల్లలను అంతలా చంపేసి తనుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భార్య లేదా? లేక భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిందా? భార్య భర్తల మధ్యలో ఏమైనా గొడవలు కావడంతో పిల్లలను చంపి శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది విచారణ చేపట్టారు.
ఇక మరోవైపు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలో సజ్జపూర్ తండాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లెలిని అత్యాచారం చేసిన వ్యక్తిని అన్న హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. తండాలో మతిస్థిమితం లేని తన చెల్లెలిపై నాగిశెట్టి పవార్ (40) అనే వ్యక్తి అత్యాచారం చేస్తుండగా అన్న రాజు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పవార్ పై పగ పెంచుకున్న అన్న రాజు ఎలాగైనా చంపాలని ప్లాన్ వేసి రెండ్రోజుల కృతం మద్యం తాగుదామని నాగిశెట్టి పవార్ ని పిలిపించాడు. మద్యం సేవించిన తర్వాత నాగిశెట్టి మత్తులోకి జారగానే మద్యం సీసాలు, బండ రాళ్లతో కొట్టి దారుణ హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
ఖమ్మం జిల్లాలో గ్రామానికి చెందిన కలపొంగు రామారావు, గంగమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు రాజేష్ (27) కల్లుగీత పని చేస్తుండగా, చిన్న కుమారుడు నవీన్ నవీన్ పెయింటింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే సోదరులకు మద్యం సేవించే అలవాటు ఉంది. అప్పుడప్పుడు మద్యం సేవించి, ఆ మత్తులో గొడవ పడేవారు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రాజేష్ ఇంటి ముందు నిల్చుని గట్టిగా కేకలు వేశాడు. తండ్రి రామారావు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే రాజేష్ తండ్రిపై చేయి చేసుకున్నాడు. అది చూసిన నవీన్ అక్కడున్న బీరు బాటిల్ పగలగొట్టి ఆ బాటిల్ తో రాజేష్ పై దాడికి యత్నించాడు. నవీన్ అటుగా వెళుతుండగా రాజేష్ తండ్రి గట్టిగా పట్టుకోగా.. పగిలిన బీరు బాటిల్ తో రాజేష్ మెడపై నవీన్ పొడిచాడు. అనంతరం తీవ్రంగా గాయపడిన రాజేష్ను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తదుపరి రోడ్డుపై మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
Health Tips: మీ పర్సుని అక్కడ పెడుతున్నారా? అయితే ఇది ఒక్కసారి చూడండి..
తాజావార్తలు
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?