వడ్లు కొనడం లేదని..యువ రైతు ఆత్మహత్యయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన సంవత్సరం తొలి రోజే ఆ రైతు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నెల రోజులుగా ఆరబోసిన ధాన్యాన్ని కాంటా వేయడం లేదనీ, అప్పు ఇచ్చిన వ్యక్తుల వద్ద పరువు పోతోందన్న వేదనతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని నర్సాపురం బోరు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన రామటెంకి సందీప్ పండించిన ధాన్యాన్ని నెల రోజుల కిందట గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తరలించి ఆరబోశాడు.
Read Also: సిఫారసు లేఖలు అనుమతించం: వైవీ సుబ్బారెడ్డి
Also Read
రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా వేయకపోవడంతో పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు, వాటి వడ్డీలు కట్టలేక తీవ్ర వేదనకు గురయ్యాడు. దాంతో శనివారం ఉదయం ధాన్యం బస్తాను గ్రామంలోని కొత్తపేట క్రాస్ రోడ్డు సెంటర్కు తెచ్చి జనం చూస్తుండగానే.. ధాన్యం బస్తాకు నిప్పుపెట్టి, తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వైద్యం కోసం సందీప్ను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!