Telangana Speaker Election: స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. 14న ఎన్నిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Speaker Election: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన వారు సభ్యులుగా ప్రమాణం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎనిమిది మంది మినహా అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం శాసనసభ సచివాలయం కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 14న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఉదయం 10.30 గంటలకు కొత్త స్పీకర్ను ప్రకటిస్తారు. 13వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కీలక స్పీకర్ పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ పేరు ఖరారైంది. ఆయన్ను స్పీకర్ గా నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
- Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి జి.ప్రసాద్ గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి డాక్టర్ మెటుకు ఆనంద్పై 12,893 ఓట్ల మెజారిటీతో భారత్ రాష్ట్ర సమితిపై విజయం సాధించారు. గడ్డం ప్రసాద్కు మొత్తం 86,885 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 73,992 ఓట్లు వచ్చాయి. 2009లో జీ ప్రసాద్ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై నమ్మకంతో వికారాబాద్ టికెట్ కేటాయించింది. ఈసారి 12 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ముందుగా ప్రసాద్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. స్పీకర్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. స్పీకర్ పదవి చేపట్టేందుకు శ్రీధర్ బాబు ఆసక్తి చూపడం లేదు. మంత్రిగా పని చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ కుమార్ను స్పీకర్గా నియమించింది.
తాజావార్తలు
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
-
S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!