Telangana : సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరుతుందా?
- 42% బీసీ రిజర్వేషన్లు.. కాంగ్రెస్ హామీ చర్చలోకి
- హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి న్యాయపరమైన అడ్డంకులు పార్టీ-స్థాయి రిజర్వేషన్లతో కాంగ్రెస్ కొత్త వ్యూహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. సర్పంచ్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చకు దారితీసింది. అయితే, ఈ హామీని అధికారికంగా కాకుండా పార్టీ పరంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన జీఓ (GO)పై ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉండడంతో, అధికారికంగా ఈ రిజర్వేషన్లను అమలు చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాని పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్లను ఖరారు చేసిన నేపథ్యంలో, న్యాయపరమైన చిక్కులను అధిగమించకుండా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే, కోర్టు స్టే ఉన్నప్పటికీ, డిసెంబర్ రెండవ వారం నుంచి ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
Also Read
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
న్యాయపరమైన అడ్డంకులను అధిగమించే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో పొలిటికల్ పార్టీ సింబల్ ఉండదు. అభ్యర్థులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులుగానే బరిలోకి దిగుతారు. ఈ అవకాశాన్ని వాడుకుంటూ, కాంగ్రెస్ పార్టీ 42% సీట్లను బీసీ అభ్యర్థులకు కేటాయించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ, జిల్లాల వారీగా ఈ పార్టీ-స్థాయి రిజర్వేషన్లను అమలు చేయాలని ఆదేశించారు.
మరోవైపు, అధికారికంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ బీసీ సంఘాలు ఇప్పటికే ఆందోళన బాట పట్టాయి. అధికారికంగా రిజర్వేషన్లు ఇచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్తో గాంధీ భవన్ ముందు వరకు ఆందోళనలు నిర్వహించిన సంఘాలు, ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ZPTC, MPTC ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. హైకోర్టులో తన వాదనలను వినిపించి, కోర్టు గడువులోపు రిజర్వేషన్ల అంశాన్ని తేల్చిన తర్వాతే MPTC, ZPTC ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ కోర్టులో అధికారికంగా రిజర్వేషన్లు అమలు చేయలేకపోయినా, పార్టీ తరపున 42% సీట్లు బీసీలకు ఇవ్వాలనే తన నిర్ణయాన్ని కాంగ్రెస్ కొనసాగించాలని తీర్మానించుకుంది. మొత్తం మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం న్యాయపరమైన సవాళ్లు , రాజకీయ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
తాజావార్తలు
-
PrabhasDp : 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియా షేక్..షేక్
-
Gold Price Today: శ్రావణ మాసం వేళ గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్.. 24K, 22K రేట్లు ఇవే
-
PM Modi: విభజన నాటి విషాదాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. బాధితుల ధైర్యానికి ప్రశంసలు..
-
VVS Laxman: బీసీసీఐలో భారీ మార్పు.. వీవీఎస్ లక్ష్మణ్కు కీలక బాధ్యతలు..?
-
IND vs SL 1st Test: టీమిండియా ప్లేయింగ్ 11పై కోచ్ కీలక హింట్.. బెంచ్లోనే ఆ నలుగురు!
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!