DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- ఇబ్రహీంపట్నం అక్టోపస్ ట్రైనింగ్ సెంటర్లో డీజీపీ పర్యటన
- SWAT టీమ్స్ శిక్షణ, మాక్ డ్రిల్స్పై ప్రత్యేక సమీక్ష
- కమాండోలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
- భవిష్యత్ ఎయిర్పోర్ట్ భద్రతపై వ్యూహాలు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP CV Anand: తెలంగాణ రాష్ట్ర కౌంటర్ టెర్రర్ ఫోర్స్ ‘అక్టోపస్’ (OCTOPUS) పనితీరు, శిక్షణ కార్యకలాపాలు , ఆపరేషనల్ సన్నద్ధతను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP) శ్రీ సీవీ ఆనంద్ గురువారం క్షుణ్ణంగా సమీక్షించారు. ఇబ్రహీంపట్నంలోని అక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, క్యాంపస్లోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, శిక్షణ విభాగం , ఆపరేషనల్ సౌకర్యాలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమాండోలు, అధికారులతో ముఖాముఖి మాట్లాడి, ఏవైనా అవాంఛనీయ ఉగ్రవాద సంఘటనలు ఎదురైతే వాటిని తిప్పికొట్టేందుకు ఫోర్స్ ఎంతవరకు సిద్ధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (SWAT) బృందాల పనితీరును , శిక్షణ విభాగాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆపరేషన్స్ విభాగం డీజీ డాక్టర్ అనిల్ కుమార్ ఈ సందర్భంగా డీజీపీకి పలు అంశాలపై వివరణ ఇస్తూ, ఆపరేషనల్ టీమ్స్ నిర్వహిస్తున్న రెగ్యులర్ కార్యకలాపాలను వివరించారు. కీలక సంస్థలు, సున్నిత ప్రాంతాల్లో కాలానుగుణంగా చేపడుతున్న మాక్ ఎక్సర్సైజులు, ఉగ్రవాద వ్యతిరేక పోరాట విన్యాసాలు , అత్యాధునిక ఆయుధాల వినియోగంలో కమాండోలకు ఇస్తున్న ప్రత్యేక శిక్షణ గురించి ఆయన పేర్కొన్నారు. కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వివిధ రకాల భవన సముదాయాలు, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే రీతిలో మాక్ ఆపరేషన్లు నిర్వహించడం అత్యంత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
కమాండోలు శారీరక దృఢత్వంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, ఎల్లప్పుడూ నిశితమైన అప్రమత్తతతో ఉంటూ 24 గంటలూ విధులకు సిద్ధంగా ఉండాలని డీజీపీ సూచించారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అత్యాధునిక పరికరాల సేకరణ , మౌలిక సదుపాయాల బలోపేతంపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలతో పాటు భవిష్యత్తులో రాబోయే విమానాశ్రయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాల వ్యూహాలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేహౌండ్స్ , అక్టోపస్ దళాలు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, వాటి వృత్తి నైపుణ్యం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన కొనియాడారు. ఈ దళాల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం , పోలీస్ శాఖ నుంచి పూర్తి స్థాయి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ సీహెచ్. రఘునందన్ , ఇతర అక్టోపస్ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!