DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- ఇబ్రహీంపట్నం అక్టోపస్ ట్రైనింగ్ సెంటర్లో డీజీపీ పర్యటన
- SWAT టీమ్స్ శిక్షణ, మాక్ డ్రిల్స్పై ప్రత్యేక సమీక్ష
- కమాండోలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
- భవిష్యత్ ఎయిర్పోర్ట్ భద్రతపై వ్యూహాలు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP CV Anand: తెలంగాణ రాష్ట్ర కౌంటర్ టెర్రర్ ఫోర్స్ ‘అక్టోపస్’ (OCTOPUS) పనితీరు, శిక్షణ కార్యకలాపాలు , ఆపరేషనల్ సన్నద్ధతను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP) శ్రీ సీవీ ఆనంద్ గురువారం క్షుణ్ణంగా సమీక్షించారు. ఇబ్రహీంపట్నంలోని అక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, క్యాంపస్లోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, శిక్షణ విభాగం , ఆపరేషనల్ సౌకర్యాలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమాండోలు, అధికారులతో ముఖాముఖి మాట్లాడి, ఏవైనా అవాంఛనీయ ఉగ్రవాద సంఘటనలు ఎదురైతే వాటిని తిప్పికొట్టేందుకు ఫోర్స్ ఎంతవరకు సిద్ధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (SWAT) బృందాల పనితీరును , శిక్షణ విభాగాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆపరేషన్స్ విభాగం డీజీ డాక్టర్ అనిల్ కుమార్ ఈ సందర్భంగా డీజీపీకి పలు అంశాలపై వివరణ ఇస్తూ, ఆపరేషనల్ టీమ్స్ నిర్వహిస్తున్న రెగ్యులర్ కార్యకలాపాలను వివరించారు. కీలక సంస్థలు, సున్నిత ప్రాంతాల్లో కాలానుగుణంగా చేపడుతున్న మాక్ ఎక్సర్సైజులు, ఉగ్రవాద వ్యతిరేక పోరాట విన్యాసాలు , అత్యాధునిక ఆయుధాల వినియోగంలో కమాండోలకు ఇస్తున్న ప్రత్యేక శిక్షణ గురించి ఆయన పేర్కొన్నారు. కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వివిధ రకాల భవన సముదాయాలు, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే రీతిలో మాక్ ఆపరేషన్లు నిర్వహించడం అత్యంత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
కమాండోలు శారీరక దృఢత్వంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, ఎల్లప్పుడూ నిశితమైన అప్రమత్తతతో ఉంటూ 24 గంటలూ విధులకు సిద్ధంగా ఉండాలని డీజీపీ సూచించారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అత్యాధునిక పరికరాల సేకరణ , మౌలిక సదుపాయాల బలోపేతంపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలతో పాటు భవిష్యత్తులో రాబోయే విమానాశ్రయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాల వ్యూహాలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేహౌండ్స్ , అక్టోపస్ దళాలు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, వాటి వృత్తి నైపుణ్యం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన కొనియాడారు. ఈ దళాల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం , పోలీస్ శాఖ నుంచి పూర్తి స్థాయి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ సీహెచ్. రఘునందన్ , ఇతర అక్టోపస్ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Director Teja: డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. “బుర్రలేని దర్శకులతో పని చేయడమే నా అదృష్టం!”
-
Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!